తెలుగు (Telugu): Indian Revised Version - Telugu

Updated ? hours ago # views See on DCS

మత్తయి సువార్త

Chapter 1

యేసు క్రీస్తు వంశ వృక్షం

1 అబ్రాహాము వంశం వాడైన దావీదు వంశం వాడు యేసు క్రీస్తు వంశావళి 2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు ఇస్సాకు కొడుకు యాకోబు యాకోబు కొడుకులు యూదా అతని సోదరులు 3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు జెరహు పెరెసు కొడుకు ఎస్రోము ఎస్రోము కొడుకు ఆరాము 4 ఆరాము కొడుకు అమ్మీనాదాబు అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నయస్సోను కొడుకు శల్మాను 5 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు ఓబేదు కొడుకు యెష్షయి 6 యెష్షయి కొడుకు దావీదు గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను 7 సొలొమోను కొడుకు రెహబాము రెహబాము కొడుకు అబీయా అబీయా కొడుకు ఆసా 8 ఆసా కొడుకు యెహోషాపాతు యెహోషాపాతు కొడుకు యెహోరాము యెహోరాము కొడుకు ఉజ్జీయా 9 ఉజ్జీయా కొడుకు యోతాము యోతాము కొడుకు ఆహాజు ఆహాజు కొడుకు హిజ్కియా 10 హిజ్కియా కొడుకు మనష్షే మనష్షే కొడుకు ఆమోను ఆమోను కొడుకు యోషీయా 11 యోషీయా కొడుకులు యెకొన్యా అతని సోదరులు వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు 12 బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి 13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు అబీహూదు కొడుకు ఎల్యాకీము ఎల్యాకీము కొడుకు అజోరు 14 అజోరు కొడుకు సాదోకు సాదోకు కొడుకు ఆకీము ఆకీము కొడుకు ఎలీహూదు 15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు ఎలియాజరు కొడుకు మత్తాను మత్తాను కొడుకు యాకోబు 16 యాకోబు కొడుకు యోసేపు యోసేపు మరియ భర్త ఆమె ద్వారా క్రీస్తు అనే పేరు గల యేసు పుట్టాడు 17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు 18 యేసు క్రీస్తు పుట్టుక వివరం ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది 19 ఆమె భర్త యోసేపు నీతిపరుడు అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు 20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభువు దూత అతనికి కలలో కనిపించి దావీదు కుమారా యోసేపూ మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు అన్నాడు 22-23 “ ‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.

     ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే

     ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు”

అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24 యోసేపు నిద్ర లేచి ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు

Chapter 2

జ్ఞానుల సందర్శన

1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి 2 యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం ఆయనను ఆరాధించడానికి వచ్చాం అన్నారు 3 హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు 4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది అని వారిని అడిగాడు 5 అందుకు వారు యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే ఎందుకంటే 6 యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు అని ప్రవక్తలు రాశారు అని చెప్పారు 7 అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు 8 తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ మీరు వెళ్ళి ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను అని చెప్పాడు 9 వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది 10 ఆ నక్షత్రం చూసి వారు అత్యధికంగా ఆనందించారు 11 ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు 12 హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు 13 వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి లేచి బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు అని అతనితో చెప్పాడు 14 యోసేపు లేచి రాత్రి వేళ బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు తరలిపోయాడు 15 హేరోదు చనిపోయే వరకూ అక్కడే ఉండిపోయాడు ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది 16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములో దాని పరిసర గ్రామాలన్నిటిలో రెండేళ్ళు అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు 17-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది.

     రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.

     వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది”

     అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.

ఈజిప్టు నుంచి నజరేతుకు రాక (లూకా 2:39,40)

19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి 20 లేచి బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు అని చెప్పాడు 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణీ తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకు వచ్చాడు 22 అయితే అర్కెలా తన తండ్రి హేరోదు స్థానంలో యూదయ ప్రాంతాన్ని పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి యోసేపు భయపడ్డాడు దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలిలయ ప్రాంతానికి వెళ్ళి 23 నజరేతు అనే ఊరిలో నివసించాడు యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది

Chapter 3

బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మార్కు 1:3-8. లూకా 3:2-17. యోహాను 1:6-8, 19-28)

1-2 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో “పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు. 3 పూర్వం యెషయా ప్రవక్త అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి ఆయన దారులు తిన్నగా చేయండి 4 ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు అతని ఆహారం మిడతలు అడవి తేనె 5 యెరూషలేము యూదయ ప్రాంతం యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి 6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు 7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు విషసర్పాల పిల్లలారా రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి 9 అబ్రాహాము మా తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను 10 ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు 11 పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు 12 తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు అని చెప్పాడు 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు 14 అయితే యోహాను నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవు నా దగ్గరికి వస్తున్నావా అని ఆయనను నివారింపజూశాడు 15 కానీ యేసు ఇప్పటికి కానివ్వు నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే అని అతనికి జవాబిచ్చాడు కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు 16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు వెంటనే ఆకాశం తెరుచుకుంది దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు 17 ఇదిగో చూడండి ఈయనే నా ప్రియమైన కుమారుడు ఈయనంటే నాకెంతో ఆనందం అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది

Chapter 4

యేసు ఎదుర్కొన్న పరీక్ష (మార్కు 1:12,13. లూకా 4:1-13. ఆది 3:6)

1 అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు అన్నాడు 4 అందుకు ఆయన మనిషి కేవలం ఆహారంతోనే బతకడు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది అన్నాడు 5 అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి దేవాలయ శిఖరంపై నిలబెట్టి 6 నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు ఎందుకంటే ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు 7 అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు అని కూడా రాసి ఉంది అని అతనితో అన్నాడు 8 అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి ప్రపంచ రాజ్యాలను వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు 9 నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను అన్నాడు 10 అప్పుడు యేసు సాతాన్ అవతలికి పో ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి ఆయన్నే నువ్వు సేవించాలి 11 అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు 12 యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు 13 ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్నహూములో నివసించాడు అది గలిలయ సముద్ర తీరాన జెబూలూను నఫ్తాలి ప్రాంతాల్లో ఉంది 14-16 “జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు,

     యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న

     యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో

     చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.

     చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.”

     అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.

17 అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం దగ్గరపడింది పశ్చాత్తాపపడండి అంటూ బోధించడం మొదలు పెట్టాడు 18 యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు వారు పేతురు అనే సీమోను అతని సోదరుడు అంద్రెయ వారు చేపలు పట్టేవారు 19 యేసు వారితో నా వెంట రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని పిలిచాడు 20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు 21 యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు వారు జెబెదయి కొడుకులు యాకోబు యోహాను వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు 22 వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు 23 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు 24 ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది రకరకాల వ్యాధులతో నొప్పులతో బాధపడుతున్న వారిని దయ్యాలు పట్టిన వారిని మూర్ఛ రోగులను పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు 25 గలిలయ దెకపొలి యెరూషలేము యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు

Chapter 5

పర్వత ప్రసంగం (లూకా 6:20-49). నవ ధన్యతలు (లూకా 6:20-23)

1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు 2 ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు 3 ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు పరలోకరాజ్యం వారిదే 4 దుఃఖించే వారు ధన్యులు వారికి ఓదార్పు కలుగుతుంది 5 సాధుగుణం గలవారు ధన్యులు ఈ భూమికి వారు వారసులవుతారు 6 నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పొందుతారు 7 కనికరం చూపే వారు ధన్యులు వారు కనికరం పొందుతారు 8 పవిత్ర హృదయం గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు 9 శాంతి కుదిర్చేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు 10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు పరలోక రాజ్యం వారిది 11 నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు 12 అప్పుడు సంతోషించండి ఉప్పొంగిపొండి పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు 13 లోకానికి మీరు ఉప్పు ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు 14 ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు దీపస్తంభం మీదే పెడతారు అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది 16 మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు 17 నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు 18 నేను కచ్చితంగా చెబుతున్నాను ఆకాశం భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా ఒక సున్నా అయినా తప్పిపోదు 19 కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు 20 ధర్మశాస్త్ర పండితుల పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను 21 హత్య చేయవద్దు హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు తన సోదరుణ్ణి పనికి మాలినవాడా అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి మూర్ఖుడా అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు 23 కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో 24 నీ కానుకను అక్కడే బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు ముందు నీ సోదరునితో రాజీ పడు ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు 25 నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీ పడు లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో 26 చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను 27 వ్యభిచారం చేయకూడదు అని చెప్పడం మీరు విన్నారు గదా 28 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా 30 నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా 31 తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి అని చెప్పడం కూడా మీరు విన్నారు 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు 33 నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు అది దేవుని సింహాసనం 35 భూమి తోడు అనవద్దు అది ఆయన పాదపీఠం యెరూషలేము తోడు అనవద్దు అది మహారాజు నగరం 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు 37 మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టే ఉండాలి అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే 38 కంటికి బదులు కన్ను పన్నుకు బదులు పన్ను అని చెప్పింది మీరు విన్నారు గదా 39 కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి 40 ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకొని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు 42 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు 43 నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పింది మీరు విన్నారు గదా 44 నేను మీతో చెప్పేదేమంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు 46 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి

Chapter 6

పర్వత ప్రసంగం - బాహ్యాచారాలపై విమర్శ

1 మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు 2 కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో వీధుల్లో అలా చేస్తారు వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను 3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు 4 అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు 5 మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను 6 నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకంలో ఉన్న మా తండ్రీ నీ నామం పవిత్రంగా ఉండు గాక 10 నీ రాజ్యం వస్తుంది గాక పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి 12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు 13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు 14 మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు 16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను 17 నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో 18 అప్పుడు ప్రజలకు కాక రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు 19 భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి దొంగలు పడి దోచుకుంటారు 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి అక్కడ చెదలుగానీ తుప్పుగానీ తినివేయవు దొంగలు పడి దోచుకోరు 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది 22 శరీరానికి దీపం కన్ను కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది 23 నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు 25 అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే ఏమి తినాలి ఏమి తాగాలి అని మీ జీవితాన్ని గురించి గానీ ఏమి కట్టుకోవాలి అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా 26 ఎగిరే పక్షుల్ని చూడండి అవి విత్తనాలు నాటవు కోత కోయవు కొట్లలో ధాన్యం కూర్చుకోవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా 27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి అవి పని చేయవు బట్టలు నేయవు 29 అయినా నేనంటాను తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే అల్ప విశ్వాసులారా ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు 32 దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు దాని సంగతి అదే చూసుకుంటుంది ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు

Chapter 7

పర్వత ప్రసంగం - ఇతరులను తప్పులెన్నడం

1 ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు 4 నీ కంటిలో దుంగను ఉంచుకొని నీ సోదరునితో నీ కంటిలోని నలుసు తీయనివ్వు అని ఎలా చెబుతావు 5 కపట వేషధారీ మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది 6 పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్టవద్దు మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో 7 అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తలుపు తీయబడుతుంది 8 అడిగే ప్రతివాడికీ లభిస్తుంది వెదికే వాడికి దొరుకుతుంది తట్టే వాడికి తలుపు తెరుచుకుంటుంది 9 మీలో ఎవరైనా తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా 10 లేక వాడు చేపను అడిగితే పామునిస్తాడా 11 మీరు చెడ్డ వారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసు గదా అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు 12 కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే 13 ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి నాశనానికి పోయే ద్వారం వెడల్పు దారి విశాలం దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు 14 జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు దారికష్టమైనది దాన్ని కనుగొనే వారు కొంతమందే 15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వస్తారు కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు 16 వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు 19 మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు e fr ft fe 21 ప్రభూ ప్రభూ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు 22 ఆ రోజున చాలామంది నాతో ప్రభూ ప్రభూ మేము నీ పేరున ప్రవచించలేదా నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా అంటారు 23 అప్పుడు నేను దుర్మార్గులారా నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు నా దగ్గర నుండి వెళ్ళిపొండి అంటాను 24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు 25 వాన కురిసింది వరదలు వచ్చాయి పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు 27 వాన కురిసింది వరదలు వచ్చాయి గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి అప్పుడది కూలిపోయింది అది ఘోరమైన పతనం 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినపుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారంగల వాడిలాగా వారికి బోధించాడు

Chapter 8

యేసు కుష్టురోగిని బాగు చేయడం

1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు 2 ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభూ నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నాడు 3 యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి నాకిష్టమే నువ్వు బాగుపడు అన్నాడు వెంటనే అతని కుష్టు రోగం నయమైంది 4 అప్పుడు యేసు అతనితో చూడు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు వెళ్ళి యాజకుడికి కనబడు వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు అని చెప్పాడు 5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి 6 ప్రభూ నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పాడు 7 నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను అని యేసు అతనికి జవాబిచ్చాడు 8 ఆ శతాధిపతి ప్రభూ నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు మాట మాత్రం అనండి నా పనివాడు బాగుపడతాడు 9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే నా చేతి కింద కూడా సైనికులున్నారు నేను ఎవడినైనా వెళ్ళు అంటే వాడు వెళ్తాడు ఎవడినైనా రా అంటే వాడు వస్తాడు నా పనివాణ్ణి ఇది చెయ్యి అంటే చేస్తాడు అని జవాబిచ్చాడు 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు 12 అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది అక్కడ ఏడుపు పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి 13 యేసు శతాధిపతితో వెళ్ళు నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది అన్నాడు ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు 14 తరవాత యేసు పేతురు ఇంట్లోకి వెళ్ళి జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు 15 యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది 16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది అదేమిటంటే మన రోగాలను భరించాడు 18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు 19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి బోధకా నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంటే వస్తాను అన్నాడు 20 అందుకు యేసు అతనితో నక్కలకు గుంటలున్నాయి పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు అన్నాడు 21 ఆయన శిష్యుల్లో మరొకడు ప్రభూ మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి అని ఆయనను అడిగాడు 22 అయితే యేసు అతనితో నాతో రా చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే అన్నాడు 23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు 24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు 25 శిష్యులు ఆయనను నిద్ర లేపి ప్రభూ చచ్చిపోతున్నాం మమ్మల్ని రక్షించండి అంటూ కేకలు వేశారు 26 యేసు వారితో అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది 27 శిష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎలాంటివాడో గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే అని చెప్పుకున్నారు 28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు 29 ఆ దయ్యాలు దైవకుమారా నీతో మాకేంటి మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా అని కేకలు వేశారు 30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది 31 నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఆ పందుల మందలోకి పోనియ్యి అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి 32 యేసు సరే పో అని వాటితో అన్నాడు అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి 33 ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు 34 అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు

Chapter 9

యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చి పక్షవాత రోగిని బాగు చేయడం (మార్కు 2:3-12. లూకా 5:18-36)

1 యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు 2 కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు యేసు వారి విశ్వాసం చూసి బాబూ ధైర్యం తెచ్చుకో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు 3 ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము అనుకున్నారు 4 యేసు వారి ఆలోచనలు గ్రహించి మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు 5 నీ పాపాలు క్షమించాను అని చెప్పడం తేలికా లేచి నడువు అని చెప్పడం తేలికా 6 అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆ పక్షవాత రోగితో నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు 7 అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు 8 ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు 9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు యేసు అతనితో నా వెంట రా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు 10 యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు 11 పరిసయ్యులు అది గమనించి మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో పాపులతో కలిసి తింటున్నాడేంటి అని ఆయన శిష్యుల్ని అడిగారు 12 యేసు అది విని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు రోగులకే అవసరం 13 నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను నీతిపరులను కాదు కాబట్టి మీరు వెళ్ళి మీరు బలులు అర్పించడం కాదు కనికరం చూపించాలనే కోరుతున్నాను అనే వాక్యభావం నేర్చుకోండి అని చెప్పాడు 14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు అని ఆయనను అడిగారు 15 యేసు వారికిలా జవాబిచ్చాడు పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి అప్పుడు వారు ఉపవాసం ఉంటారు 16 ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది ఆ చినుగు మరింత పెద్దదవుతుంది 17 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది తిత్తులు పాడైపోతాయి అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు అప్పుడు ఆ రెండూ చెడిపోవు 18 ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కూతురు ఇప్పుడే చనిపోయింది అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది అన్నాడు 19 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు 20-21 అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకొని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. 22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి అమ్మాయ్ ధైర్యంగా ఉండు నీ నమ్మకం నిన్ను బాగుచేసింది అన్నాడు అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు 24 వెళ్ళిపోండి ఈ అమ్మాయి చనిపోలేదు నిద్రపోతూ ఉంది అన్నాడు అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు 25 ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది 27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ దావీదు కుమారా మామీద దయ చూపించు అని కేకలు వేశారు 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు యేసు వారితో నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడు వారు అవును ప్రభూ అన్నారు 29 అప్పుడాయన వారి కళ్ళు ముట్టి మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది అన్నాడు 30 వారి కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు యేసు ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి అని ఖండితంగా వారికి చెప్పాడు 31 కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు 32 ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు 33 దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు అని చెప్పుకున్నారు 34 అయితే పరిసయ్యులు ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు 35 యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా చెదరిపోయి ఉన్నారు 37 ఆయన తన శిష్యులతో కోత చాలా ఎక్కువగా ఉంది కానీ పని వారు తక్కువగా ఉన్నారు 38 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి అని తన శిష్యులతో చెప్పాడు

Chapter 10

యేసు పన్నెండు మందిని పంపించడం (మార్కు 6:7-13. లూకా 9:1-6)

1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు 2 ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి మొట్ట మొదటిగా పేతురు అనే సీమోను అతని సోదరుడు అంద్రెయ జెబెదయి కొడుకు యాకోబు అతని సోదరుడు యోహాను 3 ఫిలిప్పు బర్తొలొమయి తోమా సుంకరి మత్తయి అల్ఫయి కొడుకు యాకోబు తద్దయి 4 కనానీయుడు సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా 5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు 6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి 7 వెళుతూ పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది అని ప్రకటించండి 8 రోగులను బాగుచేయండి చనిపోయిన వారిని లేపండి కుష్టరోగులను శుద్ధి చెయ్యండి దయ్యాలను వెళ్ళగొట్టండి ఉచితంగా పొందారు ఉచితంగానే ఇవ్వండి 9-10 బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు. ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు. 11 మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి 12 ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి 13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది 14 ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి 15 తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను 16 తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి పాముల్లాగా వివేకంగా పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి 17 మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు 18 వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు 19 వారు మిమ్మల్ని అప్పగించేటపుడు ఎలా మాట్లాడాలి ఏమి చెప్పాలి అని ఆందోళన పడవద్దు మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు 20 మాట్లాడేది మీరు కాదు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు 21 సోదరుడు సోదరుణ్ణి తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు 22 నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు 23 వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు పట్టణాలు అన్నిటికీ వెళ్ళి ఉండరు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను 24 గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు 25 శిష్యుడు తన గురువు లాగా పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారో గదా 26 కాబట్టి మీరు వారికి భయపడవద్దు కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి 28 ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు 31 కాబట్టి భయపడవద్దు మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు 32 మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను 33 ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను 34 నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు 35 అంటే ఒక మనిషికి అతని తండ్రితో కూతురికి తన తల్లితో కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను 36 ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు 37 నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు 38 తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు 39 తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు 40 మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు 41 ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు 42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను

Chapter 11

1 యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు 2-3 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యుల్ని పంపాడు. 4 యేసు మీరు వెళ్ళి విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి 5 గుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్టరోగులు శుద్ధులవుతున్నారు చెవిటివారు వింటున్నారు చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది 6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు అని జవాబిచ్చాడు 7 వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు గాలికి ఊగే గడ్డి పోచనా 8 అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు 9 మరింకేమి చూడడానికి వెళ్ళారు ప్రవక్తనా సరే గాని ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను 10 నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు 11 స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు 12 బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు 13 ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు 14 ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే 15 వినే చెవులున్నవాడు విను గాక 16-17 ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు. 18 ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు అతనికి దయ్యం పట్టింది అని వారంటున్నారు 19 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి వీడు తిండిబోతూ తాగుబోతూ పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు అని వారంటున్నారు అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది 20 అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు 21 అయ్యో కొరాజీనూ నీకు శిక్ష తప్పదు అయ్యో బేత్సయిదా నీకు శిక్ష తప్పదు మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకునేవారే 22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను 23 కపెర్నహూమా పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా నీవు పాతాళంలోకి దిగి పోతావు నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు తండ్రీ పరలోకానికీ భూమికీ ప్రభూ నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతుల్ని మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు అందుకు నిన్ను స్తుతిస్తున్నాను 26 అవును తండ్రీ ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు కుమారుడూ ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు 28 మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి నిస్తాను 29 నేను దీనుణ్ణి వినయ మనసు గల వాణ్ణి కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది 30 ఎందుకంటే నా కాడి సుళువు నా భారం తేలిక

Chapter 12

యేసు తనను విశ్రాంతి దినానికి ప్రభువుగా ప్రకటించుకోవడం (మార్కు 2:23-28. లూకా 6:1-5)

1 ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు 2 పరిసయ్యులు అది చూసి చూడు విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో అన్నారు 3 ఆయన వారితో దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు 5 విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా 6 దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను 7 కనికరాన్నే కోరుతున్నాను బలిని కోరను అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు 8 కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అన్నాడు 9 ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించాడు అక్కడ చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు 10 పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా అని ఆయనను అడిగారు 11 అందుకాయన మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా 12 గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే అని చెప్పి 13 ఆ మనిషితో నీ చెయ్యి చాపు అన్నాడు వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది 14 పరిసయ్యులు బయటికి పోయి ఆయనను ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు 15-16 యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది అదేమిటంటే 18 ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకున్నాను ఈయన నాకెంతో ప్రియమైన వాడు ఈయన మీద నా ఆత్మను ఉంచుతాను ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు 19 ఈయన పోట్లాడడు కేకలు వేయడు ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు 20 న్యాయాన్ని గెలిపించే వరకూ ఈయన నలిగిన రెల్లును విరవడు ఆరిపోతున్న వత్తిని నలపడు 21 ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది అనే ప్రవచనం 22 అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు అతడు గుడ్డివాడు మూగవాడు కూడా ఆయన అతణ్ణి బాగుచేశాడు అతనికి మాట చూపు రెండూ వచ్చాయి 23 అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా అని చెప్పుకున్నారు 24 పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు మరెవరి వలనా కాదు అన్నారు 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు ఏ రాజ్యమైనా సరే తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు 26 ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే 29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే 31 కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు 32 మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు 33 చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది అలా కాక చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు 34 విష సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది 35 మంచివాడు తన హృదయంలోని మంచి సంపదలో నుండి మంచి వాటిని బయటికి తెస్తాడు చెడ్డవాడు తన హృదయంలోని చెడ్డ సంపదలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు 38 అప్పుడు ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యుల్లో కొందరు ఆయనకు జవాబిస్తూ బోధకుడా నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది అన్నారు ఆయన ఇలా అన్నాడు 39 వ్యభిచారులైన ఈ దుర్మార్గపు తరం వారు సూచక క్రియ అడుగుతున్నారు యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వబడదు 40 యోనా మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు 41 నీనెవె ప్రజలు యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వారు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు చూడండి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు 42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది అయితే చూడండి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు 43 అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది 44 దానికి విశ్రాంతి దొరకదు అప్పుడది నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అనుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది 45 అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుంది అవన్నీ అక్కడే నివాసముంటాయి అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది 46 ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు 47 అప్పుడొకడు నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు అని ఆయనతో చెప్పాడు 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి నా తల్లి ఎవరు నా సోదరులెవరు అని చెప్పి 49 తన శిష్యులవైపు చెయ్యి చాపి నా తల్లి నా సోదరులు వీరే 50 నా పరలోకపు తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అన్నాడు

Chapter 13

పరలోక రాజ్య మర్మాలు. 1. విత్తనాలు (మార్కు 4:1-20. లూకా 8:4-15)

1 ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు 2 ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు 3 ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు ఆయన వారితో విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు 4 అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి 5 కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ 6 ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి 7 కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి 8 మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి వాటిలో కొన్ని వంద రెట్లు కొన్ని అరవై రెట్లు కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి 9 చెవులున్నవాడు విను గాక అన్నాడు 10 తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని అడిగారు ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు 11 పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు వారికి అనుగ్రహించలేదు 12 కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అతనికి సమృద్ధిగా ఉంటుంది లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది 13 ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు వింటున్నారు గానీ నిజానికి వినరు అర్థం చేసుకోరు 14 యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది మీరు వినడానికి వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు 15 ఈ ప్రజల హృదయం బండబారి పోయింది వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది వారి కళ్ళు మూసుకుపోయాయి వారు కళ్ళారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది 16 అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి మీ చెవులు వింటున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి 17 చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను 18 విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి 19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే 20 రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు 21 అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు 22 ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి కాబట్టి వారు ఫలించకుండా పోతారు 23 మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు కొందరు వంద రెట్లు కొందరు అరవై రెట్లు మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు 24 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది 25 మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు 26 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి 27 అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి అని అడిగారు 28 ఇది పగవాడు చేసిన పని అని అతడు వారితో అన్నాడు ఆ పనివారు మేము వెళ్ళి ఆ కలుపు మొక్కల్ని పీకేయమంటారా అని అతన్ని అడిగారు 29 అందుకు ఆ యజమాని వద్దు కలుపు మొక్కల్ని పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో 30 కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి కోతకాలంలో మొదట కలుపు మొక్కల్ని పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి అని కోత కోసే వారికి చెబుతాను అన్నాడు 31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు పరలోకరాజ్యం ఇలా ఉంది ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు 32 అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి 33 ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది 34-35 “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను.

     లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.”

అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు.

గోదుమ, కలుపు మొక్కల ఉపమానం వివరణ

36 అప్పుడాయన ప్రజలను పంపివేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పొలంలోని కలుపు మొక్కల్ని గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు అని అడిగారు 37 అందుకాయన ఇలా అన్నాడు మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు 38 పొలం ఈ లోకం మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను కోతకాలం లోకాంతం కోత కోసే వారు దేవదూతలు 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు వినగలిగే చెవులున్నవాడు విను గాక 44 పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు 45 పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు 47 పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది అందులో రకరకాల చేపలు పడతాయి 48 అది నిండినప్పుడు తీరానికి లాగి కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు 49 అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి 50 వారిని అగ్ని గుండంలో పడవేస్తారు అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి 51 వీటినన్నిటిని మీరు గ్రహించారా అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ గ్రహించాము అన్నారు 52 ఆయన అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్త వాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిలాగా ఉన్నాడు అని వారితో చెప్పాడు 53-54 యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి? 55 ఇతడు వడ్రంగి కొడుకు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనే వారు ఇతని సోదరులు కారా 56 ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు 57 అయితే యేసు ఒక ప్రవక్త తన స్వదేశంలో తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు అని వారితో చెప్పాడు 58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు

Chapter 14

బాప్తిసమిచ్చే యోహాను వధ (మార్కు 6:14-29. లూకా 9:7-9)

1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని 2 ఇతడు బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడు అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అని తన సేవకులతో చెప్పాడు 3 అంతకు పూర్వం నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు అని యోహాను చెప్పినందుకు 4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు 5 హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు 6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు 8 తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు అని అడిగింది 9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు 10 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు 11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు ఆమె తన తల్లికి ఇచ్చింది 12 యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు 13 యేసు పడవ ఎక్కి అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు ప్రజలు ఆ సంగతి విని పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు 14 యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు 15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇది నిర్జన ప్రదేశం ఇప్పటికే పొద్దుపోయింది ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి అన్నారు 16 యేసు వారితో వారు వెళ్ళనక్కర లేదు మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు 17 వారు ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు అని ఆయనతో అన్నారు 18 అందుకు ఆయన వాటిని నా దగ్గరికి తీసుకు రండి అన్నాడు 19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు అప్పుడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు శిష్యులు ప్రజలకు వడ్డించారు 20 వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి 21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు 22 యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు 23 ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు 24 అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు 26 ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు 27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడవద్దు అన్నాడు 28 పేతురు ప్రభూ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు అని ఆయనతో అన్నాడు 29 యేసు రా అన్నాడు పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని 30 గాలిని చూసి భయపడి మునిగిపోతూ ప్రభూ నన్ను రక్షించు అని కేకలు వేశాడు 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని అల్పవిశ్వాసీ ఎందుకు సందేహపడ్డావు అన్నాడు 32 యేసు పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది 33 అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పి ఆయనను ఆరాధించారు 34 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు 35 అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు 36 వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు అని ఆయనను బతిమాలారు ముట్టిన వారంతా బాగయ్యారు

Chapter 15

యేసు శాస్త్రులను, పరిసయ్యులను విమర్శించడం (మార్కు 7:1-23)

1 ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ వచ్చి 2 నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి అని యేసుని అడిగారు 3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు 4 ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు 5 కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రుల్ని పట్టించుకోనక్కర లేదని చెబుతారు 6 ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు 7-9 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”

10 ఆయన ప్రజలందరినీ పిలిచి మీరు తెలుసుకోవలసింది ఏమంటే 11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు 12 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి నీకు తెలుసా పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు అని ఆయనతో అన్నారు 13 ఆయన పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది 14 వారి జోలికి వెళ్ళవద్దు వారు గుడ్డివారు వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు 15 అందుకు పేతురు ఈ ఉపమానభావం మాకు వివరించు అని ఆయనను అడిగాడు 16 అప్పుడాయన మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి అవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి ఇది కూడా మీకు తెలియలేదా 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు హత్యలు వ్యభిచారాలు లైంగిక దుర్నీతి దొంగతనాలు అబద్ధ సాక్ష్యాలు దైవదూషణలు వస్తాయి 20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు అని వారితో చెప్పాడు 21 యేసు బయలుదేరి తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు 22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి ప్రభూ దావీదు కుమారా నన్ను కరుణించు నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది అని పెద్దగా అరిచి చెప్పింది 23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు అప్పుడు ఆయన శిష్యులు ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది ఈమెని పంపించెయ్యి అని ఆయనను వేడుకున్నారు 24 దానికి ఆయన దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు ఇంకెవరి దగ్గరకూ కాదు అని జవాబిచ్చాడు 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభూ నాకు సహాయం చెయ్యి అంది 26 ఆయన పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు అని ఆమెతో అన్నాడు 27 ఆమె ప్రభూ నిజమే కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా అంది 28 అందుకు యేసు అమ్మా నీ నమ్మకం గొప్పది నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది అని ఆమెతో చెప్పాడు సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది 29 యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు 30 ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని గుడ్డివారిని మూగవారిని వికలాంగులను ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు ఆయన వారిని బాగుచేశాడు 31 మూగవారు మాట్లాడటం వికలాంగులు బాగుపడటం కుంటివారు నడవటం గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు 32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు వారికి తినడానికి ఏమీ లేదు వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో అన్నాడు 33 ఆయన శిష్యులు ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి అన్నారు 34 యేసు మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని వారిని అడిగాడు వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పారు 35 అప్పుడు యేసు నేల మీద కూర్చోండి అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి 36 ఆ ఏడు రొట్టెలు ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు 37 వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి 38 స్త్రీలు పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు 39 తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు

Chapter 16

అంధ మత నాయకులను యేసు విమర్శించడం (మార్కు 8:1-12)

1 అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు 2 ఆయన వారితో ఇలా అన్నాడు సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ 3 అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.

4 సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో వ్యభిచారంతో నిండి ఉంది యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు 5 అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు 6 అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో అన్నాడు 7 అయితే శిష్యులు మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు అని తమలో తాము చర్చించుకున్నారు 8 యేసుకు అది తెలిసి అల్పవిశ్వాసులారా మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు 9 మీరింకా గ్రహించలేదా ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో 10 ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా 11 నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి అని వారితో చెప్పాడు 12 అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు 13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యుల్ని ఇలా అడిగాడు మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు 14 వారు కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ మరి కొందరు ఏలీయావనీ కొందరు యిర్మీయావనీ లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు అన్నారు 15 అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు అని వారిని అడిగాడు 16 వెంటనే సీమోను పేతురు నీవు అభిషిక్తుడివి సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పాడు 17 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు యోనా కుమారా సీమోనూ నీవు ధన్యుడివి ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు 18 ఇంకో విషయం నీవు పేతురువి ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు 19 పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది 20 అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు 21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల ప్రధాన యాజకుల ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది చనిపోయి మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు 22 అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి ప్రభూ అది నీకు దూరమవుతుంది నీకలా ఎప్పటికీ జరగదు అని గద్దింపుగా అన్నాడు 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి సాతానూ నా వెనక్కి పో నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు అన్నాడు 24 అప్పుడు యేసు తన శిష్యులతో ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే వాడు తనను తాను తిరస్కరించుకొని తన సిలువను మోసుకుంటూ రావాలి 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు 27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకొని వస్తాడు అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు 28 నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు అని చెప్పాడు

Chapter 17

రూపాంతరం (మార్కు 9:2-13. లూకా 9:28-36)

1 ఆరు రోజుల తరువాత యేసు పేతురు యాకోబు అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు 2 వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి 3 అదే క్షణంలో మోషే ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు 4 అప్పుడు పేతురు యేసుతో ప్రభూ మనమిక్కడే ఉండిపోదాం నీకిష్టమైతే ఇక్కడ నీకు మోషేకు ఏలీయాకు మూడు పాకలు వేస్తాను అన్నాడు 5 అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనంటే నాకు చాలా సంతోషం మీరు ఈయన చెప్పేది వినండి అని పలికింది 6 శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు 7 యేసు వారి దగ్గరికి వచ్చి వారిని తాకి భయపడకండి ఇక లేవండి అన్నాడు 8 వారు కళ్ళు తెరచి చూస్తే యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు 9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు అని యేసు వారికి ఆజ్ఞాపించాడు 10 అప్పుడు శిష్యులు మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు అని అడిగారు 11 అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే 12 అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గానీ వారు అతణ్ణి గుర్తించలేదు పైగా అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు 13 బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు 14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి 15 ప్రభూ నా కొడుకును కనికరించు వాడు మూర్ఛరోగి చాలా బాధపడుతున్నాడు పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు అని చెప్పాడు 17 అందుకు యేసు వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా నేనెంత కాలం మీతో ఉంటాను ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి అన్నాడు 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది వెంటనే అతడు బాగుపడ్డాడు 19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం అని అడిగారు 20 అందుకాయన మీ అల్పవిశ్వాసమే దానికి కారణం మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు. [1]

క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మళ్లీ చెప్పడం (మార్కు 9:30-32. లూకా 9:43-45)

22 వారు గలిలయలో ఉన్నప్పుడు యేసు మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు 23 వారు ఆయనను చంపుతారు కానీ ఆయన మూడవ రోజు సజీవుడై తిరిగి లేస్తాడు అని తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు 24 వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా అని అడిగారు 25 అతడు అవును చెల్లిస్తాడు అన్నాడు అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన సీమోనూ ఈ భూమి మీద రాజులు సుంకం పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా అని అడిగాడు 26 అతడు బయటివాళ్ళ దగ్గరే అని చెప్పాడు యేసు అలాగైతే కొడుకులు స్వతంత్రులే 27 అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది దాన్ని నాకోసం నీకోసం వారికి ఇవ్వు అన్నాడు


17:21 [1]

Chapter 18

చిన్న పిల్లల ఆదర్శం (మార్కు 9:33-37. లూకా 9:46-48)

1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని యేసుని అడిగారు 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు 3 మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే 6 కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు 7 నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది ఆటంకాలు రాక మానవు కానీ అవి ఎవరి వలన కలుగుతాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు 8 నీ చెయ్యి గాని నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే దాన్ని నరికి పారవెయ్యి రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు 11 “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, 12 మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా 13 అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను 14 అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు 15 ఇంకో విషయం నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే 16 అతడు వినకపోతే ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా పన్ను వసూలుదారుడుగా పరిగణించు 18 నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు దేని కట్లు విప్పుతారో దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు 19 ఇంకో విషయం దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు 20 ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను 21 అప్పుడు పేతురు వచ్చి ప్రభూ నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి ఏడు సార్లు సరిపోతుందా అని యేసుని అడిగాడు 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ ఏడు సార్లు వరకే కాదు ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది 24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి రాజా నా విషయం కొంచెం ఓపిక పట్టు నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు 27 ఆ రాజు జాలిపడి అతని బాకీ అంతా క్షమించి అతనిని విడిచి పెట్టేశాడు 28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి నా బాకీ తీర్చు అని అతని గొంతు పట్టుకున్నాడు 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి కొంచెం ఓపిక పట్టు నీ బాకీ అంతా తీర్చేస్తాను అని వేడుకున్నాడు 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు 31 అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి నువ్వు చెడ్డవాడివి నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు 35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు అని వారితో చెప్పాడు

Chapter 19

యూదయలో యేసు

1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలిలయ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు 2 గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి ఆయన వారిని అక్కడ బాగుచేశాడు 3 పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించడం కోసం ఏ కారణం చేతనైనా సరే పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా అని అడిగారు 4 అందుకాయన సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ 5 అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారిద్దరూ ఏకశరీరంగా అవుతారు అని చెప్పాడనీ మీరు చదవలేదా 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు ఏక శరీరమే కాబట్టి దేవుడు జత పరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని జవాబిచ్చాడు 7 అందుకు వారు అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు అని అడిగారు 8 అప్పుడాయన మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్టవచ్చని మోషే చెప్పాడు గానీ ప్రారంభం నుండీ అలా జరగలేదు 9 భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను అని వారితో అన్నాడు 10 ఆయన శిష్యులు భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది అని ఆయనతో అన్నారు 11 అందుకు యేసు దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించ లేరు 12 తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు మనుషులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారూ ఉన్నారు ఈ మాటను అంగీకరించ గలవాడు దాన్ని స్వీకరించి పాటిస్తాడు గాక అని వారితో చెప్పాడు 13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లల్ని ఆయన దగ్గరకి తీసుకుని వచ్చారు అయితే ఆయన శిష్యులు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన వారిని గద్దించారు 14 అప్పుడు యేసు చిన్నపిల్లల్ని అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి పరలోకరాజ్యం ఇలాటి వారిదే అని వారితో చెప్పాడు 15 ఆ పిల్లల మీద చేతులుంచిన తరవాత అయన అక్కడనుంచి వెళ్ళిపోయాడు 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి బోధకుడా శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని ఆయనను అడిగాడు 17 అందుకు యేసు మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు మంచి వాడు ఒక్కడే ఉన్నాడు అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు అన్నాడు 18 అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడిగాడు యేసు నరహత్య వ్యభిచారం దొంగతనం చేయవద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు 19 నీ తల్లిదండ్రుల్ని గౌరవించు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే అని చెప్పాడు 20 అందుకు ఆ యువకుడు వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను ఇవి కాక నేనింకేమి చెయ్యాలి అన్నాడు 21 అందుకు యేసు నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి దాన్ని బీదవారికి పంచిపెట్టు అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు అని అతనితో చెప్పాడు 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు 23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు అన్నారు 26 యేసు వారితో ఇది మానవులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమూ సాధ్యమే అని చెప్పాడు 27 అప్పుడు పేతురు ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా మాకేమి లభిస్తుంది అని ఆయనను అడగగా 28 యేసు వారితో ఇలా అన్నాడు కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు 29 నా నామం నిమిత్తం సోదరులను సోదరీలను తండ్రినీ తల్లినీ పిల్లలనూ భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు

Chapter 20

ద్రాక్ష తోట కూలీల కథ

1 ఎలాగంటే పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు 2 రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు 3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి 4 మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు 5 దాదాపు పన్నెండు గంటలకూ తరువాత మూడు గంటలకూ అతడు బయటికి వెళ్ళి ఆ విధంగా చేశాడు 6 మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు అని వారిని అడిగాడు 7 వారు ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు అన్నారు అతడు అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి అన్నాడు 8 సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు 9 దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది 10 అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు 11-12 వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.

13 అప్పుడా యజమాని వారిలో ఒకడితో మిత్రమా నేను నీకు అన్యాయమేమీ చేయలేదు నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా 14 నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా అని అన్నాడు 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ మొదటివారు చివరివారూ అవుతారు 17 యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి దారిలో వారితో ఇలా అన్నాడు 18 ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు వారు ఆయనకి మరణశిక్ష విధించి 19 ఆయనను అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు 20 అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది 21 నీకేమి కావాలి అని యేసు ఆమెను అడిగాడు అందుకామె నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు అంది 22 అందుకు యేసు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా అని వారిని అడగగా వారు తాగగలం అన్నారు 23 ఆయన నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ నా కుడి వైపున ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి అని చెప్పాడు 24 మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు 25 కాబట్టి యేసు వారిని పిలిచి ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు 26 కానీ మీరు అలా ప్రవర్తించకూడదు మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు అని చెప్పాడు 29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని ప్రభూ దావీదు కుమారా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు ప్రభూ దావీదు కుమారా మమ్మల్ని కరుణించు అని ఇంకా పెద్దగా కేకలు వేశారు 32 యేసు ఆగి వారిని పిలిచి మీకోసం నన్నేమి చేయమంటారు అని అడిగాడు 33 వారు ప్రభూ మాకు చూపు అనుగ్రహించు అన్నారు 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు

Chapter 21

యేసు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం (జెకర్యా 9:9. మార్కు 11:1-10. లూకా 19:29-38. యోహాను 12:12-19)

1 వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి 2 మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా దాని పిల్లా మీకు కనబడతాయి వాటిని విప్పి నా దగ్గరికి తోలుకొని రండి 3 ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే అవి ప్రభువుకు కావాలి అని చెప్పండి అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు అని చెప్పి వారిని పంపించాడు 4 దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది ఆ మాటలు ఏవంటే 5 ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి 6 అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు 7 వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు వాటిమీద ఆయన కూర్చున్నాడు 8 జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు 9 జనసమూహంలో ఆయనకు ముందూ వెనకా నడుస్తూ దావీదు కుమారుడికి జయం ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు ఉన్నతమైన స్థలాల్లో జయం అని కేకలు వేస్తూ వచ్చారు 10 ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఎవరీయన అని కలవరంతో నిండిపోయింది 11 ఆయనతో వచ్చిన జనసమూహం ఈయన యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త అని వారికి జవాబిచ్చారు 12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు డబ్బు మారకం చేసేవారి బల్లలనూ పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు 13 వారితో ఇలా అన్నాడు నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు 14 అక్కడి గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు ఆయన వారందరినీ బాగుచేశాడు 15 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు వారు దావీదు కుమారుడికి జయం అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు 16 వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా అని ఆయనను అడిగారు అందుకు యేసు వింటున్నాను చిన్నపిల్లల చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు అనే మాట మీరెప్పుడూ చదవలేదా అని వారితో చెప్పి 17 ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు 18 తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది 19 అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు ఆయన దానితో ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు అన్నాడు వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది 20 అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయి ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా అని చెప్పుకున్నారు 21 అందుకు యేసు మీకు విశ్వాసం ఉండి ఏమాత్రం సందేహపడకుండా ఉంటే ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు అంత మాత్రమే కాదు ఈ కొండతో నీవు లేచి సముద్రంలో పడిపో అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది 22 మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు అని వారితో చెప్పాడు 23 ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు ఈ అధికారం నీకెవరు ఇచ్చారు అని అడిగారు 24 యేసు నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను 25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా అని వారిని అడిగాడు 26 మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకొని 27 మాకు తెలియదు అన్నారు అప్పుడాయన అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను అన్నాడు 28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ మీకేమనిపిస్తుంది ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అతడు పెద్ద కొడుకుతో బాబూ పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి అన్నాడు 29 అతడు నేను వెళ్ళను అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకొని వెళ్ళాడు 30 అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు అతడు నేను వెళతాను అన్నాడుగానీ వెళ్ళలేదు 31 ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు అని వారిని అడిగాడు వారు మొదటివాడే అని జవాబిచ్చారు యేసు నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే పన్ను వసూలు చేసేవారు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు 32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు అయితే పన్ను వసూలు చేసేవారు వేశ్యలు నమ్మారు దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు అతనిని నమ్మలేదు 33 ఇంకో ఉపమానం వినండి ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు 34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు 35 ఆ రైతులు అతని దాసులను పట్టుకుని ఒకణ్ణి కొట్టారు ఒకణ్ణి చంపారు ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు 36 అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసుల్ని పంపాడు కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు 37 చివరికి ఆ యజమాని నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు అనుకుని తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు 38 అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి అడుగో అతడే వారసుడు అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం రండి అని తమలో తాము చెప్పుకున్నారు 39 వారు అతణ్ణి పట్టుకొని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు 40 ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతుల్ని ఏం చేస్తాడు అని వారిని అడిగాడు 41 వారు అతడు ఆ దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు అని ఆయనకు జవాబిచ్చారు 42 అప్పుడు యేసు వారితో ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది దీన్ని ప్రభువే చేశాడు ఇది మనకు ఆశ్చర్యకరం 43 కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను 44 ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది అన్నాడు 45 ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు పరిసయ్యులు గ్రహించారు 46 వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు

Chapter 22

పెళ్ళి విందు ఉపమానం (లూకా 14:16-24)

1 యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు 2 పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది 3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు అయితే వారెవ్వరూ రాలేదు 4 అప్పుడు ఆ రాజు ఇదిగో నా విందు సిద్ధంగా ఉంది ఎద్దులను కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను పెళ్ళి విందుకు రండి అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు 5 కానీ వారు లెక్క చేయకుండా ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు 7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ దుర్మార్గుల్ని సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించాడు 8 అప్పుడతడు పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు 9 కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి అని తన దాసులతో చెప్పాడు 10 ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది 11 రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు 12 రాజు అతనితో మిత్రమా పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు 13 కాబట్టి రాజు ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోవడం ఉంటాయి అని తన పరిచారకులతో చెప్పాడు 14 ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే 15 అప్పుడు పరిసయ్యులు వెళ్ళి ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు 16 వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు వారు ఆయనతో బోధకా నీవు యథార్ధవంతుడివనీ దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ ఎవరినీ లెక్క చేయవనీ ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు 17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా కాదా ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు అని అడిగారు 18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి కపటులారా నన్నెందుకు పరిశోధిస్తున్నారు 19 ఏదీ సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి అన్నాడు వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు 20 ఆయన దీనిపై ఉన్న బొమ్మ అక్షరాలు ఎవరివి అని వారినడిగాడు వారు అవి సీజరు చక్రవర్తివి అన్నారు 21 ఆయన వెంటనే అలాగైతే సీజరువి సీజరుకూ దేవునివి దేవునికీ చెల్లించండి అని వారితో చెప్పాడు 22 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు 23 అదే రోజు మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి 24 బోధకా ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే చెప్పాడు గదా 25 మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు 26 ఈ రెండోవాడు మూడోవాడు తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు 27 వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది 28 చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా అని అడిగారు 29 అందుకు యేసు మీకు లేఖనాలూ దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు 30 పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు పెళ్ళికియ్యరు వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు 31-32 చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు,

     ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’

     అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు.

33 ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు 34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు 35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి 36 బోధకా ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు 37 అందుకు యేసు నీ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేదే 38 ఇది ముఖ్యమైనదీ మొదటిదీ 39 మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే 40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తల రాతలకూ మూలాధారం అని అతనితో చెప్పాడు 41 మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు యేసు వారిని 42 క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించాడు 43 అందుకు యేసు అయితే నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ 44 నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు 45 దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు అని వారిని అడిగాడు 46 ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు అంతే కాదు ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు

Chapter 23

పరిసయ్యుల ఆగడాలు (మార్కు 12:38-40. లూకా 20:45-47)

1 అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో ఇలా అన్నాడు 2 ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు 3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి వారు చెబుతారే గాని చేయరు 4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు 5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు 6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం ప్రజలచేత బోధకా బోధకా అని పిలిపించుకోవడం వారికి ఇష్టం 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు అందరికీ ఒక్కడే బోధకుడు మీరంతా సోదరులు 9 ఇంకా భూమిమీద ఎవరినీ తండ్రి అని పిలవవద్దు పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి 10 అంతే గాక మీరు గురువులని పిలిపించుకోవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు 11 మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి 12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది 13 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు 14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.

15 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు మీకు శిక్ష తప్పదు 16 అయ్యో అంధ మార్గదర్శులారా ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి అని మీరు చెబుతారు 17 బుద్ధిహీనులారా అంధులారా ఏది గొప్పది బంగారమా ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా 18 అలాగే బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి అని మీరు చెబుతారు 19 అంధులారా ఏది గొప్పది అర్పించిన వస్తువా దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా 20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దాని తోడనీ దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు 21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు 23 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు పుదీనా సోపు జీలకర్రలో పదవ వంతు చెల్లిస్తారు కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం కరుణ విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి 24 అంధ మార్గదర్శులారా మీరు చిన్న దోమల్ని వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు 25 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు గిన్నె పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో అత్యాశతో నిండి ఉన్నాయి 26 గుడ్డి పరిసయ్యుడా గిన్నె పళ్ళెం ముందుగా లోపల శుభ్రం చెయ్యి అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది 27 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అవి బయటకి అందంగానే కనిపిస్తాయి కాని లోపల చచ్చినవారి యెముకలతో సమస్త కల్మషంతో నిండి ఉంటాయి 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు కానీ మీరు లోపల కపటంతో దుష్టత్వంతో నిండి ఉంటారు 29 అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయ్యులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు 30 మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము అని చెప్పుకొంటారు 31 నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు 32 ఇంకేం మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి 33 సర్పాల్లారా పాము పిల్లల్లారా మీరు నరకాన్ని తప్పించుకోలేరు 34 కాబట్టి వినండి నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ జ్ఞానులనూ ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను మీరు వారిలో కొంతమందిని చంపుతారు సిలువ వేస్తారు కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు 35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి మీరు దేవాలయం బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది 36 అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను 37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతూ దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు 38 ఇదుగో ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను 39 ఇప్పటి నుండి మీరు ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను

Chapter 24

ఒలీవ కొండ ప్రసంగం. దేవాలయం విధ్వంసం గురించి (మార్కు 13:1,2. లూకా 21:5,6)

1 యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు 2 అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా నేను కచ్చితంగా చెప్పేదేమంటే ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు అని వారితో అన్నాడు 3 ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి నీ రాకడకూ లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు అని అడిగారు 4 యేసు వారితో ఇలా అన్నాడు ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి 5 చాలామంది నా నామంలో వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు 6 అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు వాటి గురించిన వార్తలు వింటారు అప్పుడు కలవరపడవద్దు ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు 7 జనం మీదికి జనమూ రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి 8 ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే 9 అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు చంపుతారు నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు 10 ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు 11 అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు 12 అన్యాయం పెరిగిపోయి దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది 13 కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది 14 రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది ఆ తరువాత అంతం వస్తుంది 15 కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన వినాశకారి అయిన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే చదివేవాడు గ్రహిస్తాడు గాక 16 యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి 17 మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు 18 పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు 19 అయ్యో ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం 20 అప్పుడు మహా బాధలు కలుగుతాయి కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు ఇక ముందు రాదు 22 ఆ రోజుల్ని దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు అయితే ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజుల్ని దేవుడు తక్కువ చేస్తాడు 23 ఆ కాలంలో ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెబితే నమ్మవద్దు 24 కపట క్రీస్తులు కపట ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ అద్భుతాలూ జరిగిస్తారు 25 ఇదిగో ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను 26 కాబట్టి ఎవరైనా ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పినా ఇదిగో ఈ గది లోపల ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మవద్దు వారి వెంట వెళ్ళవద్దు 27 మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది 28 శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి 29 ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది చంద్రుడు కాంతిని కోల్పోతాడు ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి 30 అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు 31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు 32 అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు 33 అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి 34 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను 35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు 36 అయితే ఆ రోజు ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు చివరికి పరలోకంలోని దూతలకు కుమారుడికి కూడా తెలియదు 37 నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ మనుషులు తింటూ తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకొనిపోయే వరకూ వారికి తెలియలేదు ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది 40 ఆ రోజు పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే ఒకడు వెళ్ళిపోతాడు మరొకడు అక్కడే ఉండిపోతాడు 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె వెళ్ళిపోతుంది మరొకామె ఉండిపోతుంది 42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి 43 దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి 45 ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన తెలివైన దాసుడు ఎవరు 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే నా యజమాని ఆలస్యంగా వస్తాడులే అని తన మనసులో అనుకొని 49 తన సాటి సేవకులను కొడుతూ తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ ఉంటే 50 అతడు ఎదురు చూడని రోజున అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు 51 వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి

Chapter 25

ఒలీవ కొండ ప్రసంగం. ప్రభువు రాక, పదిమంది కన్యలకు పరీక్ష

1 పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకొని బయలుదేరారు 2 వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు ఐదుగురు తెలివైన వారు 3 తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు 4 తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు 5 పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు 6 అర్ధరాత్రి ఇడుగో పెళ్ళికొడుకు వస్తున్నాడు అతనికి ఎదురు వెళ్ళండి అనే పిలుపు వినిపించింది 7 అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు 8 అయితే తెలివి తక్కువవారు మా దీపాలు ఆరిపోతున్నాయి మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా అని తెలివైన వారిని అడిగారు 9 అందుకు వారు మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి అని చెప్పారు 10 వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు వెంటనే తలుపు మూశారు 11 ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభూ ప్రభూ మాకు తలుపు తెరవండి అని అడిగారు 12 కాని ఆయన నేను కచ్చితంగా చెబుతున్నాను మీరెవరో నాకు తెలీదు అన్నాడు 13 ఆ రోజైనా ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకొని ఉండండి 14 పరలోక రాజ్యం ఇలా ఉంటుంది ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు 15 వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి వెంటనే ప్రయాణమై వెళ్ళాడు 16 ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు 17 అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు 18 అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు 19 చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు 20 అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి అయ్యగారూ మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను అని చెప్పాడు 21 అతని యజమాని ఆహా నీవు నమ్మకమైన మంచి పనివాడివి నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో అన్నాడు 22 అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యగారూ మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను అని చెప్పాడు 23 యజమాని ఆహా నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో అన్నాడు 24 తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు అతడన్నాడు అయ్యగారూ మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు 25 కాబట్టి నాకు భయం వేసి మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను ఇదిగో తీసుకోండి అన్నాడు 26 అందుకు ఆ యజమాని అతనితో నీవు సోమరివాడివి చెడ్డ దాసుడివి నేను విత్తని చోట కోసేవాడిని వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా 27 అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి అని చెప్పి 28 ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి 29 ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది అతడు సమృద్ధి కలిగి ఉంటాడు లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది 30 పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోవడం ఉంటాయి 31 మనుష్య కుమారుడు తన మహిమతో తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు 32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను గొర్రెలను వేరు చేసినట్టు 33 ఆయన తన కుడి వైపున గొర్రెలు నీతిపరులు ఎడమవైపున మేకలు అనీతిపరులు ఉండేలా వేరు చేసి నిలబెడతాడు 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి నా తండ్రి ఆశీర్వదించిన వారలారా రండి లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు 36 బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు అని చెబుతాడు 37 అందుకు నీతిపరులు ప్రభూ ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం 39 ఎప్పుడు రోగివై ఉండటం చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం అని ఆయనను అడుగుతారు 40 అందుకు రాజు మీతో కచ్చితంగా చెప్పేదేమంటే దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే అని వారికి జవాబిస్తాడు 41 తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి శాపగ్రస్తులారా నన్ను విడిచి వెళ్ళండి సాతానుకు వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి 42 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు 43 పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు అని చెబుతాడు 44 అందుకు వారు కూడా ప్రభూ మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం దాహంతో ఉండటం పరదేశిగా ఉండటం దిగంబరివై ఉండటం రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు అని అడుగుతారు 45 అందుకు రాజు మీతో కచ్చితంగా చెప్పేదేమంటే మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే అని వారికి జవాబిస్తాడు 46 వీరు శాశ్వత శిక్షలోకీ నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు

Chapter 26

యేసు వధకై యూదు నాయకుల కుట్ర (మార్కు 14:1,2. లూకా 22:1,2)

1 యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో 2 రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు అని చెప్పాడు 3 ఆ సమయంలోనే ముఖ్య యాజకులు ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు 4 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని చంపాలని కుయుక్తులు పన్నారు 5 అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు 6 యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు 7 ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది 8 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది వారు ఆమెతో ఎంత నష్టం 9 దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా అన్నారు 10 యేసు ఆ సంగతి గ్రహించి ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది 11 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను 12 ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది 13 నేను కచ్చితంగా చెప్పేదేమంటే ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు 14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు 15 యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని అతడు వారినడిగాడు వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు 16 అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు 17 పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు అని అడిగారు 18 అందుకాయన మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా కాలం సమీపించింది నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి అన్నాడు 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు 20 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు 21 వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను అన్నాడు 22 అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు ప్రతి ఒక్కడూ ప్రభూ అది నేనా అని ఆయనను అడగడం ప్రారంభించారు 23 ఆయన నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు 24 మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది అని వారితో చెప్పాడు 25 ఆయనను అప్పగించబోయే యూదా ప్రభూ నేను కాదు కదా అని అడగ్గానే ఆయన నీవే చెబుతున్నావు కదా అన్నాడు 26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇస్తూ దీన్ని మీరు తీసుకుని తినండి ఇది నా శరీరం అని చెప్పాడు 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరంతా తాగండి 28 ఇది నా రక్తం అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం 29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను అన్నాడు 30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు 31 అప్పుడు యేసు వారితో ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు ఎందుకంటే కాపరిని దెబ్బ తీస్తాను మందలోని గొర్రెలు చెదరిపోతాయి 32 కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను అన్నాడు 33 అందుకు పేతురు నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను అని యేసుతో చెప్పాడు 34 యేసు అతణ్ణి చూసి నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు అన్నాడు 35 పేతురు ఆయనతో నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే నిన్ను ఎరగనని చెప్పను అన్నాడు మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు 36 ఆ తరువాత యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు ఆయన నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి అని వారితో చెప్పాడు 37 పేతురును జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో కలతలో మునిగిపోయాడు 38 అప్పుడు ఆయన వారితో నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి అని చెప్పాడు 39 అయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రీ సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి అయినా నీ ఇష్టమే నెరవేరాలి నా ఇష్టం కాదు అని ప్రార్థన చేశాడు 40 శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్ర పోతుండడం చూసి నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా 41 మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం అని పేతురుతో అన్నాడు 42 యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి నా తండ్రీ నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే నీ చిత్తమే నెరవేరనీ అని ప్రార్థన చేశాడు 43 ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి 44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు 45 అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా వినండి మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది 46 ఇంక వెళ్దాం లేవండి నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది వారి చేతుల్లో కత్తులు గదలు ఉన్నాయి 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు ఆయనను మీరు పట్టుకోండి అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు 49 అతడు యేసు దగ్గరికి వచ్చి బోధకా నీకు శుభం అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు 50 యేసు మిత్రమా నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు 51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి అతని చెవి నరికేశాడు 52 అప్పుడు యేసు నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు 53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా 54 నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది అని అతనితో అన్నాడు 55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు గదలతో వచ్చారా ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది అని చెప్పాడు అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు 57 యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు అక్కడ ధర్మశాస్త్ర పండితులు పెద్దలు సమావేశమై ఉన్నారు 58 పేతురు దూరం నుండి వెంబడిస్తూ ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు 59 ముఖ్య యాజకులు మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు 60 అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు 61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు అన్నారు 62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నీవు జవాబు చెప్పవేమిటి వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు అని అడిగాడు యేసు మౌనం వహించాడు 63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నీవు దేవుని కుమారుడు క్రీస్తువా మాతో చెప్పు అన్నాడు 64 అందుకు యేసు నీకై నీవే ఆ మాట చెప్పావు కదా నేను చెప్పేదేమంటే ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు అన్నాడు 65 వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొన్నాడు వీడు దేవదూషణ చేశాడు అతని దేవదూషణ మీరే విన్నారు కదా మనకింక సాక్షులతో పనేముంది 66 మీరేమంటారు అని సభవారిని అడిగాడు అందుకు వారు వీడు చావుకు తగినవాడు అన్నారు 67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దారు 68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తూ నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అన్నారు 69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా అని అడిగింది 70 అందుకు అతడు నీవు చెప్పే సంగతి నాకు తెలియదు అని అందరి ముందూ అన్నాడు 71 అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు అని అక్కడున్న వారితో చెప్పింది 72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అన్నాడు 73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి నిజమే నువ్వు కూడా వారిలో ఒకడివే నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది అన్నారు 74 దానితో పేతురు ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను అంటూ ఒట్లు శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు ఆ వెంటనే కోడి కూసింది 75 ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు

Chapter 27

పిలాతు దగ్గరికి యేసు (మార్కు 15:1. లూకా 23:1. యోహాను 18:28)

1 తెల్లవారింది ముఖ్య యాజకులు ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు 2 ఆయనను బంధించి తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు 3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల పెద్దల దగ్గరికి తీసుకొచ్చి 4 నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను అని చెప్పాడు అందుకు వారు ఐతే మాకేంటి దాని సంగతి నువ్వే చూసుకో అని చెప్పారు 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి వెళ్ళి ఉరి వేసుకొన్నాడు 6 ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని ఇది రక్తం కొన్న డబ్బు కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం అని చెప్పుకొన్నారు 7 వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశుల్ని పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కొన్నారు 8 ఆ పొలాన్ని నేటివరకూ రక్తపొలం అని పిలుస్తున్నారు 9 దీనితో ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల క్రయధనం ముప్పై వెండి నాణాలు 10 వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది 11 యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు అప్పుడు పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడిగాడు యేసు నీవే అంటున్నావు గదా అన్నాడు 12 ముఖ్య యాజకులు పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు 13 కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా అని ఆయనను అడిగాడు 14 అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది 15 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక 16 ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. 17 కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” 18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు.

19 అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. 20 ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.

21 పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. 22 అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. 23 పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.

24 అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. 25 అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.

బరబ్బా విడుదల

26 అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.

రాజుకు ముళ్ళ కిరీటం, సిలువ శిక్షకై కొనిపోవడం (మార్కు 15:16-23. లూకా 23:26-32)

27 అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. 28 వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. 29 ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. 30 ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. 31 అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 32 వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.

సిలువ (మార్కు 15:22-32. లూకా 23:33-43. యోహాను 19:16,17)

33 వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. 34 అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.

లేఖనాల నెరవేర్పు (మత్తయి 5:17,18. గలతీ 3:11-14)

35 వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. 36 అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.

37 “ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. 38 ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.

39 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40 “దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు.

41 అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42 “ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. 43 ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు.

44 ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు.

యేసు క్రీస్తు మరణం (మార్కు 15:33-41. లూకా 23:44-49. యోహాను 19:30-37)

45 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 46 సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.

47 అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. 49 మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు.

50 యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.

ధర్మశాస్త్ర యుగం అంతం (హెబ్రీ 9:3-8. 10:19,20)

51 అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52 సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53 వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.

54 రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకొన్నారు. 55 యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు. 56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.

57 క్రీస్తు భూస్థాపన (మార్కు 15:42-47. లూకా 23:50-56. యోహాను 19:38-42)

57 ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు. 58 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.

60 తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు. 61 మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.

62 ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, 63 “అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. 64 కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు.

65 అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు. 66 వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.

Chapter 28

యేసు క్రీస్తు సజీవంగా లేవడం (మార్కు 16:1-14. లూకా 24:1-49. యోహాను 20:1-23)

1 విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. 2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. 3 ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.

4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు. 5 ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. 6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి, 7 త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.

8 వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా 9 యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు. 10 అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు.

11 వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. 12 కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి, 13 “మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి. 14 ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు. 15 సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది.

గలిలయలో యేసు. మహాభినియామకం (మార్కు 16:15-18)

16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.

18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19 కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.