తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Mark

Mark 1

Mark 1:1-3

ప్రవక్త యెషయా ప్రభువు రాకడకు ముందు ఏమి జరుగుతుందని చెప్పాడు?

ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దంగా ఉండే ఒక దూతను పంపుతాడని యెషయా ముందుగా చెప్పాడు. (1:2-3).

Mark 1:4-6

ఏమి బోధించడానికి యోహాను వచ్చాడు?

పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడానికి యోహాను వచ్చాడు?1:4).

యోహాను చేత బాప్తిసము తీసుకున్న వారు ఏమి చేసారు?

యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారుతమ పాపాలు ఒప్పుకున్నారు. (1:5).

యోహాను ఏమి తినేవాడు?

యోహాను మిడతలను, అడవి తేనెను తినేవాడు. (1:6).

Mark 1:7-8

తన వెనుక వచ్చువాడు దేనితో బాప్తిస్మమిస్తాడని యోహాను చెపుతున్నాడు?

తన వెనుక వచ్చువాడు పరిశుద్దాత్మతో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు. (1:8).

Mark 1:9

యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న తరువాత బయటకు వచ్చినపుడుయేసు ఏమి చూసాడు?

బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆకాశము చీల్చ బడుటయు, పరిశుద్దాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు యేసు చూసాడు. (1:10).

యేసు బాప్తిసము తీసుకున్న తరువాత ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఏమి చెప్పింది?

"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించు చున్నాను" అని ఆకాశము నుండి వచ్చిన శబ్దము పలికింది. (1:11).

Mark 1:10-11

భూమి మీద పాపాలను క్షమించే అధికారం తనకు ఉందని యేసు ఎలా కనుపరచాడు?

తన పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని యేసు పక్షవాత రోగితో చెప్పాడు, ఆ వ్యక్తి అలానే చేసాడు. (2:8-12).

Mark 1:12-13

యేసును అరణ్యము లోనికి త్రోసుకు వెళ్ళింది ఎవరు?

దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకు వెళ్ళాడు. (1:12).

అరణ్యములో యేసు ఎంత కాలము ఉన్నాడు? అక్కడ ఆయనకు ఏమి జరిగింది?

యేసు అరణ్యములో నలభై రోజులు ఉన్నాడు. ఆయన అక్కడ సైతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. (1:13).

Mark 1:14-15

యేసు ఏ సందేశాన్ని ప్రకటించాడు?

దేవుని రాజ్యం దగ్గరగా ఉంది, పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మండి అని యేసు ప్రకటించాడు. (1:15).

Mark 1:16-18

సీమోనును, అంద్రెయను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?

సీమోనును, అంద్రెయను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని యేసు చెప్పాడు. (1:17).

Mark 1:19-20

సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి ఏమిటి?

సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి చేపలు పట్టడం. (1:16,19).

Mark 1:21-22

యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఎందుకు ఆశ్చర్యపడేలా చేసింది?

యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఆశ్చర్య పడేలా చేసింది ఎందుకంటే ఆయన అధికారం కలవాడిగా ఉపదేశించాడు. (1:22).

Mark 1:23-26

సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు ఏ పేరు ఇచ్చింది?

సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు దేవుని పవిత్రుడు అనే పేరు ఇచ్చింది. (1:24).

Mark 1:27-28

యేసును గురించిన వార్తతో ఏమి జరిగింది?

యేసుని గురించిన వార్త చుట్టుపక్కలా అంతటా వ్యాపించింది. (1:28).

Mark 1:29-31

వారుసీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు ఎవరిని స్వస్థపరచాడు?

వారు సీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు అతని అత్తను స్వస్థపరచాడు. (1:30).

Mark 1:32-34

సాయంకాల సమయాన ఏమి జరిగింది?

సాయంకాల సమయాన ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టిన వారినందరిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. (1:32-34).

Mark 1:35-37

సూర్యోదయాన యేసు ఏమి చేసాడు?

సూర్యోదయాన యేసు లేచి నిర్జన స్థలానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. (1:35).

Mark 1:38-39

తాను ఏమి చెయ్యడానికి వచ్చాడని యేసు పేతురుతో చెప్పాడు?

దగ్గరగా ఉన్న గ్రామాలలో ప్రకటించడానికి తాను వచ్చాడని యేసు పేతురు?ో చెప్పాడు?(1:38-39).

Mark 1:40-42

స్వస్తపడాలని బ్రతిమిలాడడానికి తన వద్దకు వచ్చిన కుష్టరోగి పట్ల యేసు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు?

యేసు కుష్టరోగి పై జాలి పడి అతనిని బాగు చేసాడు. (1:40-42).

Mark 1:43-45

ఏమి చెయ్యమని యేసు కుష్టరోగికి చెప్పాడు, ఎందుకు?

సాక్ష్యంగా ఉండేందుకు మోషే ధర్మశాస్త్రం లో విధించిన వాటిని అర్పించమని యేసు కుష్టరోగికి చెప్పాడు. (1:44).

Mark 2

Mark 2:5-12

యేసు పక్షవాత రోగితో ఏమి చెప్పాడు?

"కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది" యేసు పక్షవాత రోగితో చెప్పాడు? (2:5).

యేసు చెప్పిన దానికి ధర్మశాస్త్ర పండితులు కొందరు?ందుకు అభ్యంతర పడ్డారు?

యేసు దేవదూషణ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు?క్కడే పాపాలు క్షమించగలవాడు అని కొందరు ధర్మశాస్త్ర పండితులు ఆలోచించారు. (2:6-7).

Mark 2:13-14

నా వెంట రా అని లేవీతో యేసు చెప్పినపుడు లేవి ఏమి చేస్తున్నాడు?

యేసు పిలిచినప్పుడు లేవి సుంకం వసూలు చేసే స్థానం లో కూర్చుని వున్నాడు. (2:13-14).

Mark 2:15-16

లేవి ఇంటిలో యేసు ఏమి చెయ్యడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది ?

లేవి ఇంటిలో యేసు పాపులతో, సుంకరులతో కలిసి భోజనం చేయడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది. (2:15-16).

Mark 2:17

ఎవరిని పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు?

పాపులను పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు. (2:17).

Mark 2:18-19

ఉపవాసము గురించి కొందరు యేసును ఏమని ప్రశ్నించారు?

యెహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసమున్నప్పుడు?న శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు అని కొందరు యేసును అడిగారు. (2:18).

Mark 2:20-22

ఉపవాసము గురించి యేసు ఎలా జవాబిచ్చారు?

పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండరు, అయితే పెళ్ళికుమారుడు వారి దగ్గరనుండి తీసి వేయబడివ్పుడు వారు ఉపవాసముంటారు అని యేసు వారితో చెప్పాడు. (2:19-20).

Mark 2:23-24

విశ్రాంతి దినాన్న పంట చేలలో యేసు శిష్యులు పరిసయ్యులను అభ్యంతర పరచే పని ఏమి చేసారు?

విశ్రాంతి దినాన్న యేసు శిష్యులు పంటచేలలో కంకులు తెంపుకొని తిన్నారు. (2:23-24).

Mark 2:25-26

ఆకలి గొని నిషిద్దమయిన రొట్టెను తినిన వాని గురించి ఎలాంటి ఉదాహరణ యేసు ఇచ్చాడు?

ఆకలి గొని యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి ఇచ్చిన దావీదును గురించిన ఉదాహరణ యేసు ఇచ్చాడు? (2:25-26).

Mark 2:27-28

విశ్రాంతి దినం ఎవరి కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు?

విశ్రాంతి దినం మనుషుల కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు? (2:27).

ఏ అధికారం తనకు ఉందని యేసు చెప్పుకునాడు?

తాను విశ్రాంతి దినమునకు కూడా ప్రభువని యేసు చెప్పాడు. (2:28).

Mark 3

Mark 3:1-2

సమాజ కేంద్రంలో విశ్రాంతి దినాన్న వారు?ందుకు యేసును చూస్తూ ఉన్నారు?

ఆయన మీద నింద మోపడానికి విశ్రాంతి దినాన్న యేసు స్వస్థత చేస్తాడేమో అని వారు చూస్తూ ఉన్నారు. (3:1-2).

Mark 3:3-4

విశ్రాంతి దినము గురించి యేసు వారిని ఏమని అడిగాడు?

విశ్రాంతి దినాన మేలు చేయడమా కీడు చేయడమా ఏది ధర్మం అని యేసు వారిని అడిగాడు. (3:4).

Mark 3:5-6

యేసు ప్రశ్నకు వారు ఎలా స్పందించారు, వారి పట్ల యేసుకున్న వైఖరి ఏమిటి ?

వారు నెమ్మదిగా ఉన్నారు, యేసు వారిని కోపగించుకున్నాడు. (3:4-5).

యేసు ఆ వ్యక్తిని స్వస్త పరచిన తరువాత పరిసయ్యులు ఏమి చేసారు?

పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపాలో అని కుట్ర పన్నారు. (3:6).

Mark 3:7-10

ఆయన సముద్రము వద్దకు వెళ్ళినపుడు ఎంత మంది ఆయనను వెంబడించారు??

గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు. (3:7-9).

Mark 3:11-12

అపవిత్రాత్మలు యేసుని చూచి ఏమని అరిచారు?

యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలు యేసుని చూచి అరిచారు. (3:11).

Mark 3:13-16

యేసు ఎంత మంది అపోస్తలులను నియమించాడు, వారు ఏమి చెయ్యాలి ?

వారు ఆయనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును యేసు పన్నెండు మంది అపోస్తలులను నియమించాడు. (3:14-15).

Mark 3:17-19

యేసును మోసగించబోవు అపోస్తలుడు ఎవరు?

యేసును మోసగించబోవు అపోస్తలుడు యూదా ఇస్కరియోతు. (3:19).

Mark 3:20-22

యేసు చుట్టూ ఉన్న జనసమూహము, సంఘటనలను గురించి ఆయన ఇంటివారు?మని తలంచారు?

ఆయనకు మతి చలించినదని ఆయన ఇంటివారు తలంచారు? (3:21).

శాస్త్రులు యేసుకు వ్యతిరేకంగా ఏ నింద వేసారు?

దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసును నిందించారు. (3:22).

Mark 3:23-27

శాస్త్రులు వేసిన నిందకు యేసు స్పందన ఏమిటి ?

తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యము నిలువనేరదని యేసు చెప్పాడు. (3:23-26).

Mark 3:28-32

ఏ పాపము క్షమాపణ పొందనేరదని యేసు చెప్పాడు?

పరిశుద్డాత్మకు వ్యతిరేకమైన దూషణ క్షమాపణ పొంద నేరదని యేసు చెప్పాడు? (3:28-30).

Mark 3:33-35

తన తల్లి తన సహోదరులు ఎవరని యేసు చెప్పాడు?

దేవుని చిత్తము జరిగించు వాడే తన తల్లియు తన సహోదరులును అని యేసు చెప్పాడు? (3:33-35).

Mark 4

Mark 4:1-2

యేసు బోధించడానికి దోనె ఎందుకు ఎక్కాడు?

ఆయన దగ్గర చాలా పెద్ద జనసమూహం సమకూడినందున యేసు బోధించడానికి దోనె ఎక్కాడు? (4:1).

Mark 4:3-5

త్రోవ ప్రక్కన పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?

పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. (4:4).

Mark 4:6-7

రాతి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?

మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచి ఎండి పోయాయి. (4:5-6).

ముండ్ల పొదలలో పడిన విత్తనాలకు ఏమి జరిగింది?

ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచి వేసెను. (4:7).

Mark 4:8-9

మంచి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది?

మంచి నేలను పడిన విత్తనాలు పెరిగి పైరై ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించెను. (4:8).

Mark 4:10-12

వెలుపల ఉండువారికి కాక పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పిన దేమిటి ?

దేవుని రాజ్య మర్మము తెలిసికొనుటకు బయటి వారికిగాక ఆ పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పాడు. (4:11).

Mark 4:13-15

యేసు ఉపమానంలో విత్తనము అంటే ఏమిటి ?

విత్తనము దేవుని వాక్యము. (1:10).

త్రోవపక్కన విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ?

వాక్యమును విత్తుచుండగా విను వారిని సూచిస్తుంది. అయితే సాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. (1:11).

Mark 4:16-17

రాతి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?

వాక్యమునును విని సంతోషముగా అంగీకరించు వారిని సూచిస్తుంది అయితే శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారు. (4:16-17).

Mark 4:18-20

ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ? ?

వాక్యమును విను వారిని సూచిస్తుంది. అయితే ఈ లోక ఐహిక విచారాలు వాటిని అణచి వేస్తాయి. (4:18-19).

మంచి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?

వాక్యమును విని, అంగీకరించి ఫలమును ఫలించు వారిని సూచిస్తుంది. (4:20).

Mark 4:21-25

మరుగు చేయబడినవాటికి, రహస్యమయిన వాటికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

మరుగు చేయబడినవి, రహస్యమయినవి వెలుగు లోనికి తేబడతాయని యేసు చెప్పాడు?(4:22).

Mark 4:26-29

దేవుని రాజ్యము భూమిలో విత్తనము చల్లిన మనుష్యుని ఏ విధంగా పోలి ఉంది?

మనుష్యుడి విత్తనము చల్లుతాడు, అది పెరుగుతుంది, అతనికి తెలియకుండానే పంట వస్తుంది. దానిని అతడు సమకూరుస్తాడు. (4:26-29).

Mark 4:30-34

దేవుని రాజ్యము ఆవగింజను ఏ విధంగా పోలి ఉంది ?

ఆవగింజ భూమిలో విత్తబడినపుదు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కాని అది ఎదిగి గొప్పదై ఆకాశ పక్షులు దాని నీడను విశ్రమించును. (4:30-32).

Mark 4:35-37

యేసును ఆయన శిష్యులును నది దాటిపుడు ఏమి జరిగింది ?

పెద్ద తుఫాను రేగి దోనె నీటితో నిండి పోవునట్లుగా అలలు దోనెను కొట్టాయి. (4:35-37).

Mark 4:38-39

ఈ సమయములో దోనెలో యేసు ఏమి చేస్తున్నాడు?

యేసు నిద్ర పోతూ ఉన్నాడు. (4:38).

శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

తాము నశించి పోతుండగా ఆయనకు చింత లేదా అని యేసును ప్రశ్నించారు. (4:38).

అప్పుడు యేసు ఏమి చేసాడు?

యేసు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళ పరచెను. (4:39).

Mark 4:40-41

ఈ విధంగా యేసు చేసిన తరువాత శిష్యుల స్పందన ఏమిటి ?

శిష్యులు మిక్కిలి భయపడ్డారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. (4:41).

Mark 5

Mark 5:1-2

వారు గెరాసేనల దేశమునకు వచ్చినపుడు యేసును కలుసుకున్నదెవరు?

అపవిత్రాత్మ పట్టినవాడొకడు యేసును కలుసుకున్నాడు. (5:1-2).

Mark 5:3-6

ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు ఏమిటి ?

ఈ వ్యక్తి సమాధులలో నివసించే వాడు, చేతి సంకెళ్ళను, కట్లను తుత్తునియలుగా చేసేవాడు. ఎల్లప్పుడూ కేకలు వేస్తూ తనను తాను రాళ్ళతో గాయపరచుకొనే వాడు. (5:3-5).

Mark 5:7-8

ఈ మనుష్యునితో యేసు ఏమి చెప్పాడు??

"అపవిత్రాత్మా, ఈ మనుష్యుని విడిచిపొమ్మని చెప్పాడు. (5:8).

ఈ అపవిత్రాత్మ యేసుకు ఏ పేరు ఇచ్చింది ?

ఈ అపవిత్రాత్మ యేసును సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని పిలిచింది. (5:7).

Mark 5:9-10

ఆ అపవిత్రాత్మ పేరు ఏమిటి ?

ఆ అపవిత్రాత్మ పేరు సేన, ఎందుకంటే వారు అనేకులు. (5:9).

Mark 5:11-13

ఆ మనుష్యుని నుండి అపవిత్రాత్మను బయటకు పంపివేసినపుడు?మి జరిగింది?

ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందుల గుంపులోనికి ప్రవేశించాయి. ప్రవేశింపగా అవి నిటారుగా ఉన్న ఆ కొండమీద నుండి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి చనిపోయాయి. (5:13).

Mark 5:14-15

ఆ అపవిత్రాత్మ వెడలిపోయిన తరువాత ఆ మనుష్యుని పరిస్థితి ఎలా ఉంది ?

ఆ మనుష్యుడు బట్టలు ధరించుకొని స్వస్త చిత్తుడై యేసుతో కూర్చుండెను. (5:15).

Mark 5:16-17

జరిగిన ఈ సంఘటనలకు ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందించారు? యేసును ఏమి చెయ్యమని అడిగారు?

ఆ ప్రజలు భయపడి తమ ప్రాంతాన్ని విడిచి పొమ్మని యేసును బతిమాలుకొన్నారు. (5:15-17).

Mark 5:18-20

సమాధులలో నివసించిన వానిని ఇప్పుడు ఏమి చెయ్యమని యేసు చెప్పాడు??

ప్రభువు తనకు చేసిన కార్యములను తన ఇంటి వారికి తెలియచెప్పమని అన్నాడు. (5:19).

Mark 5:21-24

సమాజ మందిరపు అధికారి యాయీరు యేసును ఏమని అర్ధించాడు?

వచ్చి చావ సిద్ధమై ఉన్న తన కుమార్తె మీద చేతులుంచ వలసిందని యాయీరు యేసును అడిగాడు. (5:22-23).

Mark 5:25-27

యేసు వస్త్రమును ముట్టిన స్త్రీకున్న సమస్య ఏమిటి ?

ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధ పడుతుంది. (5:25).

Mark 5:28-29

ఆ స్త్రీ యేసు వస్త్రమును ఎందుకు ముట్టుకుంది ?

యేసు వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతాననుకొంది. (5:28).

Mark 5:30-32

ఆ స్త్రీ యేసు వస్త్రములను తాకినపుడు యేసు ఏమి చేసాడు?

యేసు తనలోనుండి ప్రభావము బయటకు వెళ్లిందని తనలో తాను గ్రహించి తనను తాకినదెవరో చూడడానికి చుట్టూ చూసాడు. (5:30,32).

Mark 5:33-34

జరిగిన సత్యమంతా ఆ స్త్రీ యేసుకు చెప్పినపుడు యేసు ఆమెతో ఏమి చెప్పాడు??

తన విశ్వాసము ఆమెను స్వస్థ పరచెను, సమాధానముతో వెళ్ళమని చెప్పాడు. (5:34).

Mark 5:35

యాయీరు ఇంటికి యేసు చేరినప్పుడు యాయీరు కుమార్తె పరిస్థితి ఎలా ఉంది ?

యాయీరు కుమార్తె చనిపోయింది. (5:35).

Mark 5:36-38

ఆ సమయంలో యేసు యాయీరుకు ఏమి చెప్పాడు??

భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని యేసు యాయీరుతో చెప్పాడు. (5:36).

Mark 5:39-40

యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు ఏమి అన్నారు?

యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు యేసుని చూచి అపహసించారు. (5:40).

ఆ చిన్నది ఉన్న గదిలోనికి యేసుతో పాటు ఎవరు వెళ్ళారు?

యేసు ఆ చిన్నదాని తండ్రిని, తల్లిని, పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళాడు. (5:37,40).

Mark 5:41-43

ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఎలా స్పందించారు?

ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఉక్కిరిబిక్కిరై ఎంతో విస్మయ మొందారు. (5:42).

Mark 6

Mark 6:1-3

యేసు స్వగ్రామ ప్రజలు యేసును చూసి ఎందుకు ఆశ్చర్య పడ్డారు?

ఈ బోధ, జ్ఞానం, ఆయన అద్భుతాలు యేసుకు ఎక్కడనుండి వచ్చాయి అని ప్రజలకు అర్ధం కాలేదు. (6:2).

Mark 6:4-6

ప్రవక్త ఎక్కడ ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు??

ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు. (6:4).

తన స్వగ్రామములోని ప్రజలలో దేనిని చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు??

తన స్వగ్రామములోని ప్రజలలోని అవిశ్వాసమును చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు?(6:6).

Mark 6:7-9

పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి ఏమి ఇచ్చాడు??

పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. (6:7).

పన్నెండుమంది శిష్యులు ప్రయాణము కొరకు వారితో ఏమి తీసుకొని వెళ్ళారు?

పన్నెండుమంది చేతికర్ర, చెప్పులు, ఒక అంగీని వారితో తీసుకొని వెళ్ళారు(6:8).

Mark 6:10-13

ఏ స్థలమందైనను వారిని స్వీకరించని యెడల ఏమి చెయ్యాలని పన్నెండు మంది శిష్యులకు యేసు చెప్పాడు?

వారిమీద సాక్షముగా ఉండుటకు వారి పాదముల క్రింద ధూళి దులిపి వేయాలని యేసు పన్నెండు మందికి చెప్పాడు. (6:11).

Mark 6:14-17

యేసు ఎవరని ప్రజలు అనుకొంటున్నారు?

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అని, ఏలియా అని, ప్రవక్త అని ప్రజలు అనుకొంటున్నారు. (6:14-15).

Mark 6:18-22

తాను చేయుచున్నది న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను దేని గురించి చెప్పాడు??

హేరోదు తన సహోదరుని భార్యను పెండ్లి చేసుకోవడం న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు? (6:18).

బాప్తిస్మమిచ్చు యోహాను సందేశాన్ని విని హేరోదు ఎలా స్పందించాడు?

యోహాను మాటలు వినిన ప్రతీసారి హేరోదు కలవరపడినా సంతోషముతో అతని మాటలు వినుచుండెను. (6:20).

Mark 6:23-25

హేరోదియకు హేరోదు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?

తన రాజ్యములో సగము మట్టుకు తనను ఏమి అడిగినను ఇచ్చెదనని ఆమెకు ప్రమాణం చేసాడు. (6:23).

దేనికొరకు హేరోదియా అడిగింది ?

బాప్తిస్మమిచ్చు యోహాను తల ఒక పళ్ళెములో ఇప్పించమని అడిగింది.(6:25).

Mark 6:26-29

హేరోదియా మనవి పట్ల హేరోదు ఏ విధంగా స్పందించాడు?

హేరోదు బహుగా విచార పడ్డాడు, అయితే తన అతిధుల ఎదుట తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము ఆమె మనవిని నిరాకరించలేదు. (6:26).

Mark 6:30-32

యేసు, ఆయన అపోస్తలులును తమకు తాముగా విశ్రాంతి తీసుకోడానికి ప్రయత్నించినపుడు ఏమి జరిగింది ?

అనేకులు వారిని గుర్తుపట్టారు, పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. (6:31-33).

Mark 6:33-36

వారి కొరకు ఎదురు చూస్తున్న జన సమూహము పట్ల యేసు వైఖరి ఏమిటి ?

వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు. (6:34).

Mark 6:37-38

యేసు అడిగినప్పుడు ప్రజలకు ఆహారం పెట్టడానికి శిష్యులు ఏమి చెయ్యాలని ఆలోచించారు??

వారు వెళ్లి రెండు దేనారముల విలువైన రొట్టెలను కొనాలని తలంచారు. (6:37).

శిష్యుల వద్ద ఇంతకుముందే ఉన్న ఆహారం ఏమిటి ?

శిష్యుల వద్ద ఇంతకుముందే ఐదు రొట్టెలు, రెండుచేపలు ఉన్నాయి.

Mark 6:39-41

రొట్టెలను, చేపలను తీసుకొనినప్పుడు యేసు ఏమి చేసాడు?

రొట్టెలను, చేపలను తీసుకొని యేసు ఆకాశమువైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు. (6:41).

Mark 6:42-47

అందరు తినిన తరువాత ఎంత ఆహారం మిగిలింది ?

అందరు తిని తృప్తి పొందిన తరువాత చేపలును, రొట్టె ముక్కలును పండ్రెండుగంపలు మిగిలాయి. (6:43).

రొట్టెలు తినిన పురుషులు ఎంత మంది ?

ఆ రొట్టెలు తినిన వారు అయిదు వేల మంది పురుషులు. (6:44).

Mark 6:48-50

శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై ఎలా వచ్చాడు?

శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై నడుచుకుంటూ వచ్చాడు? (6:48).

తనను చూసినప్పుడు యేసు శిష్యులకు ఏమి చెప్పాడు?

ధైర్యము తెచ్చుకొని, భయపడకుడని యేసు తన శిష్యులకు చెప్పాడు?(6:50).

Mark 6:51-52

రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు ఎందుకు అర్ధం చేసుకోలేదు ?

వారి హృదయాలు బండబారిపోయి ఉన్నాయి కాబట్టి రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు అర్ధం చేసుకోలేదు. (6:52).

Mark 6:53-55

ఆ ప్రాంత ప్రజలు యేసును గుర్తు పట్టినప్పుడు ఏమి చేసారు?

రోగులను మంచాల మీద తీసుకొని వచ్చారు, ఆయన ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి చేరారు. (6:55).

Mark 6:56

కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న వారికి ఏమి జరిగింది ?

యేసు వస్త్రపు చెంగును ముట్టుకున్న వారు స్వస్థత పొందారు. (6:56).

Mark 7

Mark 7:2-5

పరిసయ్యులు, శాస్త్రులను అభ్యంతర పెట్టినట్లుగా యేసు శిష్యులలో కొందరు చేస్తున్న పని ఏమిటి ?

యేసు శిష్యులలో కొందరు అపవిత్రమయిన చేతులతో భోజనం చేస్తున్నారు. (7:2,5).

భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం ఎవరి ఆచారం ?

భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం పెద్దల ఆచారం (7:3-4).

Mark 7:6-10

కడుగుటను గురించిన భోధ విషయం లో యేసు పరిసయ్యులు, శాస్త్రులకు యేసు ఏమి చెప్పాడు??

పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు అనియు, వారు మానవ కల్పిత నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారని యేసు చెప్పాడు(7:6-9).

Mark 7:11-13

నీ తల్లి దండ్రులను ఘనపరచాలి అనే ఉపదేశాన్ని పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు ఏ విధంగా త్రోసివేస్తున్నారు?

వారి తల్లి దండ్రులకు ప్రయోజన కరమైన ధనమును అది కోర్బాను అని ఇచ్చే వారికి చెప్పడం ద్వారా దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. (7:10-13).

Mark 7:14-16

ఏది మనుష్యుని అపవిత్ర పరచదని యేసు చెప్పాడు?

వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్త్రునిగా చేయగలుగునది ఏదియు లేదని యేసు చెప్పాడు. (7:15,18-19).

ఏది మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు?

లోపలినుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు. (7:15,20-23).

Mark 7:17-19

ఏ రకమైన భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు?

అన్ని భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు. (7:19).

Mark 7:20-23

లోపలినుండి వెలుపలికి రాగలిగి మనుష్యుని అపవిత్రపరచు మూడు?ంశములేవి ?

దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము అనునవి లోపలినుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును. (7:21-22).

Mark 7:24-26

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ యూదురాలా లేక గ్రీసు దేశస్థ్తురాలా ?

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ గ్రీసు దేశస్థ్తురాలు. (7:25-26).

Mark 7:27-28

పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు అని యేసు చెప్పిన మాటకు ఆ స్త్రీ ఏ విధంగా స్పందించింది ?

కుక్క పిల్లలు కూడ బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును కదా అని ఆ స్త్రీ చెప్పింది. (7:28).

Mark 7:29-32

ఆ స్త్రీ కొరకు యేసు ఏమి చేసాడు?

అ స్త్రీ కుమార్తె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. (7:29-30).

Mark 7:33-35

చెవుడు, నత్తివానిని యేసు నొద్దకు తీసుకొని వచ్చినపుడు?ేసు ఏమి చేసాడు?

యేసు అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి చూసి, తెరువబడమని చెప్పాడు. (7:33-34).

Mark 7:36-37

ఆయన స్వస్థతలను గురించి ఎవరితోను చెప్పవద్దని వారితో చెప్పిన తరువాత అ ప్రజలు ఏమి చేసారు? ?

ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసారు. (8:1-2).

Mark 8

Mark 8:1-4

తనను వెంబడిస్తున్న జనసమూహము పట్ల యేసు ఎలాంటి జాలి చూపించాడు??

తనను వెంబడిస్తున్న జనసమూహము తినదానికి ఏమీ లేనందున వారి పట్ల యేసు జాలి చూపించాడు. (8:1-2).

Mark 8:5-6

శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి ?

శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి (8:5).

శిష్యుల రొట్టెలను యేసు ఏమి చేసాడు?

యేసు ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యుల కిచ్చెను. (8:6).

Mark 8:7-10

ఎంత మంది తిని తృప్తి చెందారు?

ఇంచుమించు నాలుగు వేల మంది పురుషులు తిని తృప్తి చెందారు. (8:9).

అందరు తిన్న తరువాత ఎంత భోజనం మిగిలింది ?

అందరు తిన్న తరువాత ఏడు గంపలనిండా భోజనం మిగిలింది (8:8).

Mark 8:11-13

ఆయనను పరీక్షించ దానికి పరిసయ్యులు యేసును ఏమి చెయ్యమని అడిగారు?

ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని పరిసయ్యులు యేసును అడిగారు. (8:11).

Mark 8:14-15

పరిసయ్యుల విషయంలో దేని గురించి యేసు తన శిష్యులను హెచ్చరించాడు?

పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు? (8:15).

Mark 8:16-17

దేని గురించి యేసు మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు?

తాము రొట్టెలు తేవడం మర్చిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు. (8:16).

Mark 8:18-21

ఆయన చెప్పిన అర్ధాన్ని అవగాహన చేసుకోడానికి వారికి తాను చేసిన ఏ అద్భుతాలను యేసు జ్ఞాపకం చేసాడు?

అయిదు వేల మందికి ఆహారం పెట్టడం, నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం గురించి వారికి జ్ఞాపకం చేసాడు. (8:19-21).

Mark 8:22-26

గుడ్డివాడు చూపు పూర్తిగా పొందటానికి యేసు చేసిన మూడు?ార్యాలు ఏమిటి ?

యేసు మొదట అతని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచాడు, తరువాత అతని కన్నుల మీద చేతులుంచాడు.(8:23-24).

Mark 8:27-28

యేసు ఎవరని జనులు చెప్పుకొంటున్నారు?

యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా అనియు, ప్రవక్తలలో ఒకడని జనులు చెప్పుకొంటున్నారు?(8:28).

Mark 8:29-30

యేసు ఎవరని పేతురు చెప్పాడు?

యేసే క్రీస్తు అని పేతురు చెప్పాడు (8:29).

Mark 8:31-32

భవిష్యత్తులో జరిగే ఏ సంఘటనల గురించి యేసు తన శిష్యులకు స్పష్టంగా చెప్పడం ఆరంభించాడు??

మనుష్య కుమారుడు?నేక హింసలు పొందాలి, ఉపేక్షించ బడాలి, చంపబడాలి, మూడు దినములైన తరువాత లేపబడాలనే సంగతుల గురించి యేసు వారికి బోధించాడు. (8:31).

Mark 8:33-34

పేతురు తనను గద్దింప మొదలు పెట్టినపుడు యేసు పెతురుతో ఏమన్నాడు. ?

"సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను కాదు" అని యేసు పేతురుతో చెప్పాడు. (8:33).

తనను వెంబడించు ప్రతి ఒక్కరు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?

తనను వెంబడింప గోరువాడు తనను తాను ఉపేక్షించు కొని తన సిలువనెత్తుకోవాలని యేసు చెప్పా డు. (8:34).

Mark 8:35-37

లోకములోని వాటిని సంపాదించుకోవాలనే కోరిక ఉన్నవాని గురించి యేసు ఏమి చెప్పాడు?

"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?" అని యేసు అన్నాడు. (8:36).

Mark 8:38

తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?

ఆయన వచ్చునపుడు తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను సిగ్గుపడతాడని యేసు చెప్పాడు? (8:38).

Mark 9

Mark 9:1-3

దేవుని రాజ్యము బలముతో వచ్చునప్పుడు ఎవనిని చూస్తారు అని ఎవరి గురించి యేసు చెప్పాడు?

అక్కడ ఆయనతో నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని యేసు చెప్పాడు. (9:1).

ఆయనతో కలిసి పేతురు, యోహాను, యాకోబు ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్లినపుడు యేసుకు ఏమి జరిగింది ?

యేసు రూపాంతరం చెందాడు, ఆయన వస్త్రాలు ప్రకాశమానముగా మారాయి. (9:2-3).

Mark 9:4-6

కొండ మీద యేసుతో మాట్లాడుతున్నదెవరు?

ఏలియా, మోషేలు యేసుతో మాట్లాడుతున్నారు. (9:4).

Mark 9:7-8

కొండ మీద మేఘములోనుండి వచ్చిన శబ్ధము ఏమి చెప్పింది ?

"ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి" అని చెప్పింది. (9:7).

Mark 9:9-10

కొండమీద చూసిన దాని విషయంలో యేసు తన శిష్యులకు ఏమి ఆజ్ఞాపించాడు?

మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు వారు చూచిన దానిని ఎవరితోనూ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (9:9).

Mark 9:11-16

ఏలియా రావడం గురించి యేసు ఏమి చెప్పాడు?

ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క బెట్టునని, ఏలియా ముందే వచ్చాడని యేసు చెప్పాడు. (9:11-13).

Mark 9:17-19

ఆ తండ్రి కుమారులకు శిష్యులు ఏమి చెయ్యలేక పోయారు?

ఆ తండ్రి కుమారునిలో నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్ట లేక పోయారు. (9:17-18).

Mark 9:20-22

అపవిత్రాత్మ ఆ బాలుని దేని లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది ?

అపవిత్రాత్మ ఆ బాలుని అగ్నిలోనికి, నీళ్ళ లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. (9:22).

Mark 9:23-27

నమ్ము ప్రతీవానికి సమస్తమును సాధ్యము అని చెప్పినపుడు? తండ్రి ఎలా స్పందించాడు?

"నమ్ముచున్నాను, అపనమ్మకముండకుండ సహాయము చేయుమని" తండ్రి అడిగాడు. (9:23-24).

Mark 9:28-29

మూగదైన చెవిటి దయ్యమును ఆ చిన్నవానిలోనుండి శిష్యులు ఎందుకు వదలగొట్ట లేక పోయారు?

ప్రార్ధన వలననే దాని అది వెళ్ళ గొట్టబడును గనుక శిష్యులు దానిని వదలగొట్ట లేక పోయారు? (9:28-29).

Mark 9:30-32

తనకు ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్పాడు?

తాను మరణమునకు అప్పగింపబడతాడని, మూడు దినముల తరువాత తిరిగి లేస్తాడని వారికి చెప్పాడు. (9:31).

Mark 9:33-35

శిష్యులు మార్గమున వెళ్ళుచుండగా దేని గురించి వారు రోదించుచున్నారు??

వారిలో ఎవరు గొప్ప వారు?ని శిష్యులు వాదించుచున్నారు. (9:33-34).

ఎవరు మొదటి వాడు అని యేసు అన్నాడు?

అందరికీ పరిచారకుడైన వాడు మొదటివాడు అని యేసు అన్నాడు. (9:35).

Mark 9:36-41

యేసు నామం లో ఒక చిన్న బిడ్డను ఎవరైనా చేర్చుకొంటె వారు ఎవరిని చేర్చుకుంటున్నారు?

ఎవరైనా యేసు నామం లో ఒక చిన్న బిడ్డను చేర్చు కొంటె వారు చేర్చుకుంటున్నారు, అంతే కాకుండా యేసును పంపిన వానిని కూడా చేర్చుకుంటున్నారు. (9:36-37).

Mark 9:42-46

చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వానికి ఏమి జరగడం మేలు అని యేసు చెప్పాడు?

చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. (9:42).

నిన్ను అభ్యంతర పరచు దానిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?

నిన్ను అభ్యంతర పరచు దేనినైనను నరికి వెయ్యాలని యేసు చెప్పాడు. (9:47).

Mark 9:47-50

నరకంలో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

నరకంలో వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని యేసు చెప్పాడు?9:48).

Mark 10

Mark 10:1-4

పరిసయ్యులు యేసును శోధించడానికి ఏ ప్రశ్న అడిగారు?

పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని పరిసయ్యులు యేసును అడిగారు. (10:2).

విడనాడుటను గురించి యూదులకు మోషే ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

ఒకడు పరిత్యాగ పత్రిక వ్రాయించి తన భార్యను విడనాడవచ్చునని మోషే సెలవిచ్చాడు. (10:4).

Mark 10:5-6

విడనాడుటను గురించిన ఆజ్ఞలను యూదులకు మోషే ఎందుకు ఇచ్చాడు?

వారి హృదయ కఠినత్వాన్ని బట్టి యూదులకు ఈ ఆజ్ఞలను మోషే రాసి ఇచ్చాడు. (10:5).

వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు చరిత్ర లో ఏ సంఘటనను ప్రస్తావిస్తున్నాడు?

వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు ఆరంభం లో స్త్రీ, పురుషుడు సృష్టి చెయ్యబడిన సంఘటనను ప్రస్తావించాడు. (10:6).

Mark 10:7-12

ఇద్దరు వ్యక్తులు అనగా పురుషుడు, స్త్రీ వివాహము అయిన తరువాత ఏమౌతారని యేసు చెప్పాడు??

వారిద్దరూ ఏక శరీరమౌతారని యేసు చెప్పాడు. (10:7-8).

వివాహములో దేవుడు జత పరచుటను గురించి యేసు ఏమీ చెప్పాడు?

దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని యేసు చెప్పాడు. (10:9).

Mark 10:13-14

తన వద్దకు చిన్న బిడ్డలను తీసుకొను వచ్చువారిని అభ్యంతర పరచిన వారి విషయం లో యేసు చూపిన ప్రతిచర్య ఏమిటి ?

యేసు శిష్యులను కోపగించుకున్నాడు, చిన్న బిడ్డలను తన వద్దకు రానివ్వమని వారితో చెప్పాడు. (10:13-14).

Mark 10:15-16

దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని ఎలా స్వీకరించాలని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని చిన్నబిడ్డవలె అంగీకరించాలి అని యేసు చెప్పాడు. (10:15).

Mark 10:17-19

నిత్య జీవమునకు వారసుడగుటకు మొదట ఏమి చెయ్యాలని అతనికి యేసు చెప్పాడు?

నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని యేసు ఆ వ్యక్తికి చెప్పాడు. (10:19).

Mark 10:20-22

ఆ తరువాత యేసు అతనికి ఇచ్చిన అదనపు ఆజ్ఞలు ఏమిటి ?

తనకు కలిగినవన్నియు అమ్మి ఆయనను వెంబడించాలని చెప్పాడు. (10:21).

ఈ ఆజ్ఞ ఇచ్చినపుడు ఆ వ్యక్తి ఎలా స్పందించాడు, ఎందుకు?

అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ వ్యక్తి విచారపడుతూ వెళ్ళిపోయాడు. (10:22).

Mark 10:23-25

దేవుని రాజ్యం లోనికి ప్రవేశించాలంటే ఎవరికి కష్టం అని యేసు చెప్పాడు??

ఆస్థిపరులు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం కష్టతరం అని యేసు చెప్పాడు. (10:23-25).

Mark 10:26-28

ఆస్థిపరులు కూడా రక్షించబడగలరు అని యేసు ఎలా చెప్పాడు?

మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే అని యేసు చెప్పాడు. (10:26-27).

Mark 10:29-31

ఇంటిని, కుటుంబాన్ని, భూములనైనను యేసు కొరకు విడిచినవాడు ఏమి పొందుతాడని యేసు చెప్పాడు?

వారు ఐప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందును నిత్య జీవమును పొందుదురని చెప్పాడు. (1:10).

Mark 10:32-34

యేసును ఆయన శిష్యులును ఏ మార్గమున వెళుతున్నారు?

యేసును ఆయన శిష్యులును యెరుషలేము వెళ్ళు మార్గమున పోవుచున్నారు. (10:32).

తనకు యెరుషలేములో ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్ప్పాడు?

తనకు మరణశిక్ష విధించబడబోతున్నదని, మూడు దినములైన తరువాత తిరిగి లేపబదతాడని తన శిష్యులకు యేసు చెప్పాడు. (10:33-34).

Mark 10:35-37

యాకోబు, యోహానులు యేసుకు చేసిన మనవి ఏమిటి ?

తన మహిమయందు ఆయన కుడివైపున ఒకడునును, ఎడుమవైపు ఒకడును కూర్చుండునట్లు దయచేయమని యేసును అడిగారు. (10:35-37).

Mark 10:38-40

యాకోబు, యోహాను ఏమి సహించవలసి ఉంది అని యేసు చెపుతున్నాడు?

తాను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, తాను పొందుచున్న బాప్తిస్మము తీసుకోనుట యైనను వారి చేతనగునాయని వారిని అడిగాడు. (10:39).

యాకోబు, యోహానుల మనవి యేసు అంగీకరించాడా?

లేదు. తన కుడివైపున, ఎడుమవైపున కూర్చుండ నివ్వడం తన వశములో లేదని చెప్పాడు. (10:40).

Mark 10:41-42

అన్యజనులలో అధికారులు తమ ప్రజలను ఏ విధంగా చూస్తారని యేసు చెప్పాడు?

అన్యజనులలోని అధికారులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారని ప్రభువు చెప్పాడు. (1:10).

Mark 10:43-45

శిష్యులలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ఏవిధంగా ఉండాలని యేసు కోరుతున్నాడు. ?

ఎవడైనను గొప్పవాడై ఉండగోరితే వాడు పరిచారము చేయవలెనని ప్రభువు చెప్పాడు. (10:43-44).

Mark 10:46-50

గుడ్డివాడైన బర్తిమయి మౌనంగా ఉండాలని అతనిని గద్దించినపుడు అతను ఏమి చేసాడు?

"దావీదు కుమారుడా నన్ను కరుణించు" మని మరి బిగ్గరగా కేకలు వేసాడు. (10:48).

Mark 10:51-52

బర్తిమయి గుడ్డితనం నుండి స్వస్థత పొందడానికి యేసు ఏమి చెప్పాడు?

బర్తిమయి విశ్వాసము అతనిని బాగు చేసిందని యేసు చెప్పాడు. (10:52).

Mark 11

Mark 11:1-3

యేసు వారికి ఎదురుగా ఉన్న గ్రామానికి ఇద్దరు మనుషులను పంపి వారిని ఏమి చెయ్యమని చెప్పాడు?

ఎవరూ ఎన్నడూ కూర్చుండని గాడిద పిల్లను తన వద్దకు తీసుకు రమ్మని వారిని పంపాడు. (11:2).

Mark 11:4-6

గాడిద పిల్లను విప్పుతున్నప్పుడు ఏమి జరిగింది ?

వారేమి చేయుచున్నారని కొందరు అడిగారు, అందుకు శిష్యులు యేసు వారికాజ్ఞాపించినట్టు చెప్పారు, అప్పుడు వారు దానిని పోనిచ్చారు. (11:5-6).

Mark 11:7-10

గాడిద పిల్ల మీద యేసు ఎక్కి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమి పరచారు?

ప్రజలు తమ బట్టలను దారి పొడుగునా పరచారు, కొందరు పొలములో నరికిన కొమ్మలు పరచిరి. (11:8).

యేసు యెరూషలేము వైపుకు వెళ్తుండగా ప్రజల రానున్న ఏ రాజ్యము గురించి కేకలు వేస్తున్నారు?

తమ తండ్రి అయిన దావీదు రాజ్యము రాబోతున్నాదని కేకలు వేస్తున్నారు. (11:10).

Mark 11:11-12

దేవాలయ ప్రాంగణములోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?

చుట్టూ సమస్తమును చూచి బేతనియకు వెళ్ళాడు. (11:11).

Mark 11:13-14

ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేని అంజూరపు చెట్టుని చూసినపుడు యేసు ఏమి చేసాడు?

"ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని అంజూరపు చెట్టుతో అన్నాడు. (11:14).

Mark 11:15-16

ఈ సమయంలో యేసు దేవాలయంలోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?

క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టాడు, దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. (11:15-16).

Mark 11:17-19

లేఖనముల ప్రకారం దేవాలయము ఏవిధంగా ఉండాలని యేసు చెప్పాడు?

దేవాలయము సమస్తమైన జనములకు ప్రార్థన మందిరము అనబడును అని యేసు చెప్పాడు. (11:17).

శాస్త్రులు, ప్రధాన యాజకులు మందిరాన్ని ఏమి చేసారు?ని యేసు చెప్పాడు?

మందిరాన్ని దొంగల గుహగా చేసారని యేసు చెప్పాడు. (11:18).

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఏమి చేయాలని ప్రయత్నించారు?

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపడానికి ప్రయత్నించారు. (11:20).

Mark 11:20-23

యేసు మాట్లాడిన అంజూరపు చెట్టుకు ఏమి జరిగింది ?

యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి పోయింది. (11:20).

Mark 11:24-26

ప్రార్థనలో మనము అడుగువాటన్నిటి గురించి యేసు ఏమి చెప్పాడు?

ప్రార్థన చేయుచున్నప్పుడు మనము అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మాలి, అప్పుడవి మనకు కలుగును. (11:24).

పరలోకమందున్న తండ్రి కూడా క్షమించునట్లు మనము ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?

పరలోకమందున్న తండ్రి మనలను క్షమించునట్లు ఒకని మీద విరోధ మేదైనను కలిగిఉన్నయెడల వారిని క్షమించాలి. (11:25).

Mark 11:27-28

మందిరములో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు నుండి ఏమి తెలుసుకోగోరారు?

ఏ అధికారము వలన తాను చేయుచున్న పనులను చేయుచున్నాడని తెలుసుకోగోరారు. (11:27-28).

Mark 11:29-30

ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను యేసు ఏమి అడిగాడు?

యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా అని అడిగాడు. (11:30).

Mark 11:31-33

యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను ఎందుకు చెప్పడానికి ఇష్టపడలేదు ?

యోహానును ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడని వారు జవాబు చెప్పలేదు. (11:31).

యోహాను బాప్తిస్మము మనుషుల నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదు ?

వారు ప్రజలకు భయపడ్డారు, యోహాను ఒక ప్రవక్త అని వారు ఎంచారు గనుక వారు జవాబు చెప్పలేదు. (11:32).

Mark 12

Mark 12:1-3

ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ఏమి చేసాడు?

ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ప్రయాణమై వెళ్ళాడు. (12:1).

Mark 12:4-5

పంటలో భాగము తీసికొని రావడానికి తన దాసులను పంపినపుడు రైతులు ఏమి చేసారు?

ఆ రైతులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపి వేసారు. కొందరిని చంపివేశారు. (12:3-5).

Mark 12:6-7

యజమాని రైతుల వద్దకుకు చివరిగా ఎవరిని పంపించాడు?

యజమాని రైతుల వద్దకుకు చివరిగా తన ప్రియ కుమారుని పంపాడు. (1:10).

Mark 12:8-9

యజమాని చివరిగా రైతుల వద్దకు పంపిన వానిని ఏమి చేసారు?

ఆ రైతులు అతనిని పట్టుకొని, చంపి, ద్రాక్ష తోట వెలుపల పారవేసారు. (12:8).

ఆ రైతుల విషయంలో ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు?

యజమాని వచ్చి అ రైతులను సంహరించి ఆ ద్రాక్షా తోటను ఇతరులకు ఇచ్చును. (12:9).

Mark 12:10-12

కట్టు వారు నిషేధించిన రాయికి ఏమి జరుగుతుందని లేఖనాలు చెపుతున్నాయి ?

కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అవుతుంది. (12:10).

Mark 12:13-15

పరిసయ్యులు, హేరోదియనులలో కొందరు యేసును ఏమి అడిగారు??

కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. (12:14).

Mark 12:16-17

వారి ప్రశ్నలకు యేసు ఎలా జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించమని చెప్పాడు. (12:17).

Mark 12:18-19

దేనియందు సద్దూకయ్యులు నమ్మకముంచరు?

సద్దూకయ్యులు పునరుత్థానములో నమ్మకముంచరు. (12:18).

Mark 12:20-23

సద్దూకయ్యులు చెప్పిన కథలో ఆ స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?

ఆ స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు?(12:22).

సద్దూకయ్యులు ఆ స్త్రీని గురించి యేసు ఏమని అడిగారు?

పునరుత్థానమందు వారిలో ఎవరికీ ఆమె భార్యగా ఉంటుంది అని అడిగారు. (12:23).

Mark 12:24-25

సద్దూకయ్యుల పొరపాటుకు యేసు ఏమి సమాధానం ఇచ్చాడు?

సద్దూకయ్యులు లేఖనములను గాని, దేవుని శక్తిని గురించి గాని ఎరుగరు అని చెప్పాడు. (12:24).

స్త్రీని గురించి సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని సమాధానం ఇచ్చాడు?

మృతులలో నుండి లేచునపుడు?ెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యబడరు అని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. (12:25).

Mark 12:26-27

పునరుద్ధానము ఉన్నదని లేఖనముల నుండి యేసు ఎలా చూపించాడు?

నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు? అందరూ ఇంకా సజీవులుగానే ఉన్నారని దేవుడు చెప్పిన దానిని ప్రస్తావించాడు. (12:26-27).

Mark 12:28-29

ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు?

నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (12:29-30).

యేసు చెప్పిన రెండవ ఆజ్ఞ ఏది?

నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెననునది రెండవ ఆజ్ఞ అని యేసు చెప్పాడు (12:31).

Mark 12:30-34

ఇవన్నియు జరుగు వరకు ఏమి గతించదని యేసు చెప్పాడు?

ఇవన్నియు జరుగు వరకు అంతము గతింపదని యేసు చెప్పాడు. (13:30).

ఏమి గతింపవు అని యేసు చెప్పాడు?

ఆయన మాటలు గతింపవు అని యేసు చెప్పాడు. (13:32).

ఈ విషయాలు ఎప్పుడు నెరవేరుతాయని యేసు చెప్పాడు?

తండ్రి తప్ప మరి ఎవరికీ ఆ దినం గానీ, గంట గానీ తెలియవు అని చెప్పాడు (13:32).

Mark 12:35-37

దావీదు గురించి శాస్త్రులను యేసు ఏమని ప్రశ్నించాడు?

దావీదు క్రీస్తును ప్రభువని చెప్పుచున్నాడు, ఆయన ఏలాగు అతని కుమారుడగును అని యేసు అడిగాడు. (12:35-37).

Mark 12:38-42

శాస్త్రుల విషయంలో దేని గురించి జాగ్రత్త పడమని యేసు చెప్పాడు?

శాస్త్రులు మనుష్యుల చేత గౌరవింప బడాలని కోరతారు, అయితే వారు విధవరాండ్ర ఇండ్లు దిగ మింగుతారు, ప్రజలు చూడాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. (12:38-40).

Mark 12:43-44

పేద విధవరాలు కానుక పెట్టె లో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసిందని యేసు ఎందుకు చెప్పాడు??

ఆమె తన లేమిలో తనకు కలిగినదంతటిలో వేసింది అయితే ఇతరులు తమకు కలిగిన సమృద్దిలోనుండి వేసారు అని యేసు చెప్పాడు. (12:44).

Mark 13

Mark 13:1-2

దేవాలయము కట్టడములు, దానిలోని అద్భుతమైన రాళ్ళకు ఏమి జరగబోతుందని యేసు చెప్పాడు?

రాతిమీద రాయి యొకటియైనను నిలిచి యుండకుండ పడద్రోయబడునని యేసు చెప్పాడు. (13:2).

Mark 13:3-4

అప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?

ఇవి ఎప్పుడు పెరుగుతాయి, వాటి గురుతులు ఏవి అని అడిగారు. (13:4).

Mark 13:5-6

దేని విషయంలో శిష్యులు జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు?

ఎవడును వారిని మోసపుచ్చకుండా చూచుకోవాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. (13:5-6).

Mark 13:7-8

వేదనలకు ప్రారంభం అని వేటి గురించి యేసు చెప్పాడు?

వేదనలకు ప్రారంభం యుద్ధాలు, యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు అని యేసు చెప్పాడు. (13:7-8).

Mark 13:9-10

శిష్యులకు ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).

మొదట ఏమి జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు?

సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).

Mark 13:11-13

కుటుంబ సభ్యుల మధ్య ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు??

కుటుంబములోని ఒక సభ్యుడు మరొకరిని మరణానికి అప్పగిస్తారు?ని యేసు చెప్పాడు. (13:12).

ఎవరు రక్షించ బడతారు అని యేసు చెప్పాడు?

అంతము వరకు సహించిన వాడే రక్షించ బడును అని యేసు చెప్పాడు. (13:13).

Mark 13:14-16

యూదయలో ఉన్నవారు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలవడం చూచినపుడు వారు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు??

నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు చూచినపుడు యూదావారు కొండలకు పారిపోవాలి అని యేసు చెప్పాడు. (13:14).

Mark 13:17-20

ఏర్పరచబడిన వారి నిమిత్తము వారు రక్షింపబడు నిమిత్తము ప్రభువు ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?

ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమల దినములను ప్రభువు తక్కువ చేసాడని యేసు చెప్పాడు. (13:20).

Mark 13:21-23

ఎవరు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు?

అబద్దపు క్రీస్తులు, అబద్దపు ప్రవక్తలు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు? (13:22).

Mark 13:24-32

ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత ఆకాశములోని శక్తులకు ఏమి జరుగుతుంది?

సూర్య చంద్రులను చీకటి కమ్ముతుంది, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ మందు శక్తులు కదిలించ బడతాయి. (13:24-25).

మేఘాలలో దేనిని మనుష్యులు చూస్తారు?

మనుష్య కుమారుడు మహా ప్రభావముతోను, మహిమతోను మేఘవాహనుడై వచ్చుట చూస్తారు. (13:26).

మనుష్య కుమారుడు వచ్చినపుడు ఏమి చేస్తాడు?

మనుష్య కుమారుడు వచ్చినపుడు భూమ్యంతము మొదలుకొని ఆకాశము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకోనిన వారిని పోగుచేయించును. (13:27).

Mark 13:33-37

ఆయన రాకడ గురించి తన శిష్యులకు యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు. (13:33,35,37).

Mark 14

Mark 14:1-2

ఏమి చెయ్యాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆలోచిస్తున్నారు?

మాయోపాయము చేత ఆయనను ఎలా పట్టుకొని చంపుదామా అని ఆలోచిస్తున్నారు. (14:1).

ప్రధాన యాజకులు, శాస్త్రులు పులియని రొట్టెల పండుగ సమయములో ఎందుకు యేసును పట్టుకొనలేదు ?

పండుగ సమయములో ప్రజలలో అల్లరి కలుగునేమో అని ఆందోళన చెందారు. (14:2).

Mark 14:3-5

కుష్టరోగి అయిన సీమోను ఇంటి వద్ద ఒక స్త్రీ యేసుకు ఏమి చేసింది ?

మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. (14:3).

ఎందుకు కొందరు ఆమెను గద్దించారు?

ఆ అత్తరు ఎక్కువకు అమ్మి ఆ డబ్బును బీదలకియ్యవచ్చు గదా, అని గద్దించారు. (14:5).

Mark 14:6-9

ఆ స్త్రీ తనకు ఏమి చేసిందని యేసు చెప్పాడు?

ఆ స్త్రీ తన భూస్థాపాన నిమిత్తము ఆయన శరీరమును అభిషేకించిందని యేసు చెప్పాడు. (14:8).

ఆ స్త్రీ చేసిన దాని విషయంలో యేసు ఏ వాగ్దానాన్ని చేసాడు?

సర్వ లోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింప బడునో అక్కడ ఆ స్త్రీ చేసినవి జ్ఞాపకార్ధముగా ప్రకటింపబడునని వాగ్డానము చేసాడు. (14:9).

Mark 14:10-11

ఇస్కరియోతు యూదా ఎందుకు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు??

యేసును వారికి పట్టివ్వడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు? (14:10).

Mark 14:12-16

వారందరూ కలిసి పస్కాను భుజించడానికి శిష్యులు స్థలాన్నిఎలా కనుగొన్నారు?

వారు పట్టణములోనికి వెళ్లి అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న వానిని వెంబడించి, వారు భుజించుటకు విడిది గది ఎక్కడ అని అతనిని అడుగమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (14:12-14).

Mark 14:17-19

వారు బల్ల వద్ద కూర్చుని భోజనం చేయుచుండగా యేసు ఏమి చెప్పాడు??

శిష్యులలో ఒకడు తన్ను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:18).

Mark 14:20-21

ఏ శిష్యుడు తనను అప్పగింపబోతున్నాడని యేసు చెప్పాడు?

తనతో పాటు పాత్ర లో చెయ్యి ముంచు శిష్యుడే తనను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:20).

తనను అప్పగించబోతున్న వాని గమ్యము గురించి యేసు ఏమి చెప్పాడు?

ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు అని యేసు చెప్పాడు. (14:21).

Mark 14:22-25

విరువబడిన రొట్టెను శిష్యులకు ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?

"మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము" అని యేసు చెప్పాడు? (14:22).

పాత్రను శిష్యులకి ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?

"ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము" అని యేసు చెప్పాడు. (14:24).

ఈ ద్రాక్షారసమును ఎప్పుడు తాగుతాడని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యములో ద్రాక్షా రసమును కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని యేసు చెప్పాడు. (14:25).

Mark 14:26-29

ఒలీవల కొండ వద్ద శిష్యుల విషయం ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?

తన నిమిత్తము శిష్యులందరూ అభ్యంతరపడతారని యేసు ముందుగా చెప్పాడు. (14:27).

Mark 14:30-31

తాను అభ్యంతరపడనని పేతురు చెప్పిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?

ఆరోజు కోడి రెండు సార్లు కూయక ముందే తనను ఎరుగనని పేతురు మూడు సార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు. (14:30).

Mark 14:32-34

తాను ప్రార్థించుచుండగా తన ముగ్గురు శిష్యులను ఏమి చెయ్యమని యేసు చెప్పాడు?

వారు ఎక్కడ ఉండి ప్రార్ధించమని వారితో యేసు చెప్పాడు. (14:32-34).

Mark 14:35-36

దేని కొరకు యేసు ప్రార్ధించాడు??

ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్ధించాడు. (14:35).

తండ్రికి తాను చేసిన ప్రార్ధనకు వచ్చే జవాబుకు తన అంగీకారము ఏమిటి ?

తండ్రి చిత్తము ఏదైనప్పటికీ అంగీకరించడానికి యేసు ఇష్టం చూపాడు. (14:36).

Mark 14:37-39

తన ముగ్గురు శిష్యుల వద్దకు తాను వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??

తన ముగ్గురు శిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:37).

Mark 14:40-42

ప్రార్ధన నుండి రెండవ సారి వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??

తన ముగ్గురు?ిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:40).

ప్రార్ధన నుండి మూడవ సారి వచ్చినప్పుడు ఏమి చూసాడు??

తన ముగ్గురు?ిష్యులు నిద్ర పోవడం ఆయన చూసాడు. (14:41).

Mark 14:43-46

యేసు గుర్తించడానికి యూదా ఏ గుర్తును ఇచ్చాడు?

యూదా యేసును ముద్దు పెట్టడం ద్వారా ఆ వ్యక్తి యేసు అని చూపించ గోరాడు. (14:44-45).

Mark 14:47-50

లేఖనము నెరవేరునట్లు తనను బంధించడములో ఏమి జరిగిందని యేసు చెప్పాడు?

బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను పట్టుకొన వచ్చినందున లేఖనము నేరవేరినదని యేసు చెప్పాడు. (14:48-49).

యేసు పట్టబడినపుడు ఆయనతో ఉన్నవారు ఏమి చేసారు??

యేసుతో ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయారు. (14:50).

Mark 14:51-52

యేసును వెంబడిస్తున్న పడుచువాడు యేసు పట్టబడినపుడు ఏమి చేసాడు?

ఆ పడుచువాడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయాడు. (14:51-52).

Mark 14:53-54

ప్రధాన యాజకుని వద్దకు యేసును తీసుకొని వెళ్ళినపుడు పేతురు ఎక్కడ ఉన్నాడు??

పేతురు సైనికుల కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొంటున్నాడు. (14:53-54).

Mark 14:55-59

మహాసభలో యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యంలో ఉన్న లోపము ఏమిటి ?

యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యం అబద్దము, అవి ఒకదానికొకటి సరిపడలేదు. (14:55-59).

Mark 14:60-62

యేసు ఎవరనే దాని విషయం ప్రధాన యాజకుడు యేసును అడిగాడు?

పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు తానేనా అని ప్రధాన యాజకుడు యేసును అడిగాడు. (14:61).

ప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానమేమిటి ?

పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు తానేనని యేసు జవాబిచ్చాడు. (14:62).

Mark 14:63-65

యేసు సమాధానము వినిన ప్రధాన యాజకుడు యేసు దోషి అని చెప్పడానికి ఏమి చేసాడు??

దేవదూషణ చేసిన కారణంగా యేసు దోషి అని ప్రధాన యాజకుడు చెప్పాడు. (14:64).

మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరము మోపిన తరువాత యేసును ఏమి చేసారు?

వారు ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దుచూ కొట్టారు. (14:65).

Mark 14:66-70

పేతురు యేసుతో ఉన్నవాడు అని చెప్పిన చిన్న బాలికతో పేతురు ఏమి అన్నాడు?

తనకు తెలియదనీ, ఆమె అంటున్నది తనకు బోధ పడలేదనీ పేతురు బాలికతో చెప్పాడు. (14:66).

Mark 14:71-72

యేసు శిష్యులతో ఉన్నవాడు అని పేతురును మూడవ మారు అడిగినప్పుడు పేతురు స్పందన ఏమిటి ?

యేసును ఎరుగనని శపించు కొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. (14:71).

మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత ఏమి జరిగింది ?

మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత రెండవ సారి కోడి కూసింది. (14:72).

కోడి కూత వినిన తరువాత పేతురు ఏమి చేసాడు?

కోడి కూత వినిన తరువాత పేతురు కృంగి పోయి ఏడ్చాడు. (14:72).

Mark 15

Mark 15:1-3

ఉదయం కాగానే ప్రధాన యాజకుడు ఏమి చేసారు?

ఉదయం కాగానే వారు యేసును బంధించి, పిలాతుకు అప్పగించారు. (15:1).

Mark 15:4-5

ప్రధాన యాజకులు యేసు పై అనేకమైన నిందలు మోపుచుండగా యేసు గురించి ఏది పిలాతును ఆశ్చర్య పడేలా చేసింది?

యేసు ఏ జవాబు చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడ్డాడు. (15:5).

Mark 15:6-8

పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఏమి చేస్తుండే వాడు?

పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఒక ఖయిదీని విడుదల చేస్తుండే వాడు. (15:6).

Mark 15:9-11

ఎందుకు పిలాతు యేసును జనసమూహము కొరకు విడుదల చెయ్య గోరాడు?

ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకున్నాడు. (15:10).

ఎవరిని విడుదల చెయ్యమని జనసమూహం కేకలు పెట్టారు, అతడు చెరసాలలో ఉండునట్లు ఏమి చేసాడు?

బరబ్బాను విడుదల చెయ్యమని వారు కేకలు వేసారు, అతడు హంతకుడు. (15:7,11).

Mark 15:12-15

యూదుల రాజుకు ఏమి చెయ్యాలని జనసమూహం అడిగారు?

యూదుల రాజు సిలువ వేయబడాలని జనసమూహం కేకలు వేసారు. (15:12-14).

Mark 15:16-18

అధిపతి సైనికులు యేసును ఏవిధంగా సిద్ధపరచారు??

సైనికులు యేసుకు ఊదారంగు వస్త్రాన్ని ధరింప చేసారు, ముండ్ల కిరీటాన్ని తలపై పెట్టారు. (15:17).

Mark 15:19-21

యేసు సిలువను ఎవరు మోశారు?

కురేనియుడైన సీమోను యేసు సిలువను మోయడానికి బలవంత పెట్టబడ్డాడు. (15:21).

Mark 15:22-24

యేసును సిలువ వెయ్యడానికి సైనికులు తీసుకొని వచ్చిన స్థలము పేరు ఏమిటి ?

యేసును సిలువ వెయ్యడానికి తీసుకొని వచ్చిన స్థలము పేరు గొల్గోత. (15:22).

యేసు వస్త్రములను సైనికులు ఏమి చేసారు?

యేసు వస్త్రముల కొరకు సైనికులు చీట్లు చేసారు?(15:24).

Mark 15:25-28

యేసుకు వ్యతిరేకంగా సైనికులు చెక్క పై ఏమి రాసారు?

సైనికులు ఆ చెక్క పై "యూదులకు రాజు" అని రాసారు. (15:26).

Mark 15:29-30

దారివెంట వెళుతున్న వారు యేసును ఏమి చెయ్య మని సవాలు చేస్తున్నారు?

తనని తాను రక్షించు కొని సిలువ మీద నుండి కిందికి దిగి రమ్మని ఆయనను సవాలు చేస్తున్నారు. (15:29).

Mark 15:31-32

తాము నమ్మునట్లు యేసును ఏమి చెయ్య మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు?

తాము నమ్మునట్లు యేసును సిలువ మీదనుండి దిగి రమ్మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు. (15:31-32).

యేసును హేళన చేస్తూ ప్రధాన యాజకులు ఆయనకు ఇచ్చిన బిరుదులు ఏమిటి ?

ప్రధాన యాజకులు ఆయనను క్రీస్తు అని, ఇశ్రాయేలుకు రాజు అని పిలిచారు. (15:32).

Mark 15:33-35

ఆరవ గంట సమయములో ఏమి జరిగింది ?

ఆరవ గంట సమయములో ఆ దేశమంతటను చీకటి కమ్మింది. (15:33).

తొమ్మిదవ గంట సమయంలో యేసు ఏమని అరిచాడు??

"నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి" అని బిగ్గరగా కేక వేసాడు. (15:34).

Mark 15:36-38

తాను చనిపోక ముందు యేసు ఏమి చేసాడు?

ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. (15:37).

యేసు చనిపోయినప్పుడు దేవాలయములో ఏమి జరిగింది ?

దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది. (15:38).

Mark 15:39-41

యేసు చనిపోయిన విధానాన్ని చూసిన శతాధిపతి ఏమని సాక్ష్యమిచ్చాడు?

నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. (15:39).

Mark 15:42-44

ఏ రోజున యేసు చనిపోయాడు?

విశ్రాంతి దినమునకు ముందు రోజున యేసు చనిపోయాడు? (15:42).

Mark 15:45-47

యేసు చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు ఏమి చేసాడు?

అరిమతయి యోసేపు పిలాతును యేసు దేహమును తనకిమ్మని అడిగాడు, సిలువనుండి ఆయనను దించి, నార బట్టతో ఆయనను చుట్టి, సమాధి యందు ఆయనను ఉంచాడు, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. (15:43,46).

Mark 16

Mark 16:1-2

యేసు దేహాన్ని అభిషేకించడం కోసం స్త్రీలు సమాధి యొద్దకు ఎప్పుడు వెళ్ళారు?

వారంలో మొదటి రోజున సూర్యోదయమైనప్పుడు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు. (16:2).

Mark 16:3-4

సమాధి వద్ద పెద్ద రాయి ఉన్నప్పటికీ ఆ స్త్రీలు సమాధి లోనికి ఎలా ప్రవేశించారు?

సమాధి వద్ద ఉన్న రాయిని ఎవరో దొరలించి వేసారు. (16:4).

Mark 16:5-8

ఆ స్త్రీలు సమాధి లోనికి ప్రవేశించగానే ఏమి చూసారు?

తెల్లని అంగీ ధరించు కొనియున్న ఒక యువకుడు కుడి వైపున కూర్చుండుట చూసారు. (16:5).

యేసును గురించి యువకుడు ఏమి చెప్పాడు?

యేసు లేచి ఉన్నాడు, అక్కడ లేడు అని ఆ యువకుడు చెప్పాడు (16:6).

శిష్యులు యేసును ఎక్కడ కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు?

శిష్యులు యేసును గలలియలో కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు. (16:7).

Mark 16:9-11

యేసు పునరుత్థానుడైన తరువాత మొదట ఎవరికీ కనిపించాడు??

యేసు పునరుత్థానుడైన తరువాత మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. (16:9).

యేసు బ్రతికి ఉన్నాడని మరియ యేసు శిష్యులకు చెప్పినపుడు వారు ఏవిధంగా స్పందించారు?

శిష్యులు నమ్మలేదు. (16:11).

Mark 16:12-13

యేసు సజీవుడిగా చూసామని మరొక ఇద్దరు చెప్పినపుడు శిష్యులు ఏవిధంగా స్పందించారు?

శిష్యులు నమ్మలేదు (16:13).

Mark 16:14-16

యేసు శిష్యులకు ప్రత్యక్ష్యమైనపుడు వారి అపనమ్మకమును గురించి యేసు ఏమన్నాడు?

వారి అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించాడు. (16:14).

యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ఆజ్ఞాపించాడు. (16:15).

ఎవరు రక్షించబడతారని యేసు చెప్పాడు?

నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడుదురని యేసు చెప్పాడు. (16:16).

ఎవరికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు?

నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు. (16:16).

Mark 16:17-18

నమ్మిన వారి వలన ఏ సూచక క్రియలు కనబడునని యేసు చెప్పాడు?

నమ్మిన వారు దయ్యములను వెళ్ళ గొట్టుడురు, కొత్త భాషలు మాట్లాడుతారు, మరణకరమైనదేదియు వారికి హాని చెయ్యదు. వారు ఇతరులను స్వస్థత పరచుదురు. (16:17-18).

Mark 16:19-20

శిష్యులతో మాట్లాడిన తరువాత యేసుకు ఏమి జరిగింది ?

శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).

అప్పుడు శిష్యులు ఏమి చేసారు?

శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).

అప్పుడు ప్రభువు ఏమి చేసాడు?

ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).